విశాలాంధ్ర`విజయవాడ : ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం పాలైన నేపథ్యంలో సీఎం పదవికి జగన్ రాజీనామా చేశారు. జగన్ తన రాజీనామా లేఖను మంగళవారం సాయంత్రం ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ కు పంపారు. ఏపీలో టీడీపీ కూటమి ప్రభంజనం సృష్టించడం తెలిసిందే. కూటమికి 165 సీట్లు రాగా, వైసీపీ 11 స్థానాలకే పరిమితమైంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడనుంది. ప్రమాణస్వీకారం, కేబినెట్ ఏర్పాటు తదితర అంశాలపై బుధవారం స్పష్టత వచ్చే అవకాశం ఉంది.