విశాలాంధ్ర -శెట్టూరు : నిరుపేద విద్యార్థి వైద్య ఖర్చులకు ఇన్ఫినిటీ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ బద్దే నాయక్ ఆర్థిక సాయం అందించాడు.శనివారం మండలం పరిధిలో మాకొడికి గ్రామానికి చెందిన హరిజన శంకరప్ప,నీలమ్మ దంపతుల కుమారుడు ఆదిత్య (10 సంవత్సరాలు)4వ తరగతి చదువుతున్నాడు వీరిది చాలా నిరుపేద కుటుంబం ఆదిత్య అను విద్యార్ధి ఆడుకుంటూ ప్రమాదవశాత్తు పడి వెన్నెముక, కుడి కాళ్ళు దెబ్బతిని నడవలేని స్థితిలో ఉన్నాడు ఆదిత్యను కళ్యాణదుర్గం లోని RDT ఆసుపత్రిలో చూపించగా మెరుగైన వైద్యం కోసం బెంగళూరు వెళ్ళమని డాక్టర్లు సూచించి నెల రోజులైంది వైద్య ఖర్చులు RDT వారే భరిస్తారని తెలిపారు బెంగళూరుకు వెళ్ళడానికి చేతిలో చిల్లి గవ్వ కూడా లేదని దిక్కుతోచని స్థితిలో ఉండగా గ్రామ యువకులు అదే గ్రామంలో పని చేస్తున్న ఉపాధ్యాయుడు బద్దేనాయక్ కు విషయం తెలియజేయగా తక్షణం స్పందించి 15,000/- నగదును అందజేసి రేపటి రోజు బెంగళూరు వెళ్ళమని సూచించారు.కార్యక్రమంలో ఉపాధ్యాయులు సతీష్,ఓబులేష్,రాము,చిరంజీవి మరియు గ్రామస్థులు పాల్గొన్నారు