జిల్లా సహకార అధికారి పిల్లి రమేష్
ఘనంగా అంతర్జాతీయ సహకార దినోత్సవం
విశాలాంధ్ర- విజయనగరం టౌన్ : పేదరిక నిర్మూలనలో సహకార సంఘాల పాత్ర శ్లాఘనీయమని జిల్లా సహకార అధికారి పి.రమేష్ కొనియాడారు. అంతర్జాతీయ సహకార దినోత్సవం సందర్భంగా, శనివారం స్థానిక జిల్లా సహకార బ్యాంకు ఆవరణలో పతాకావిష్కరణ చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధి గా పాల్గొన్న డిసిఓ రమేష్ మాట్లాడుతూ, పేదరికాన్ని నిర్మూలించే కార్యక్రమాల్లో సహకార సంఘాలు అందిస్తున్న సేవలు మరువలేనివని అన్నారు. సరైన నాయకత్వం ఉంటే సహకార సంఘాలు గణనీయమైన విజయాలను సాధిస్తాయని చెప్పారు. ప్రతిసంవత్సరం జులై మొదటి శనివారం ప్రపంచ సహకార దినోత్సవము గా జరుపుకొంటున్నామని తెలిపారు. బ్యాంకింగ్ రంగం లో సహకార సంఘాలు ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొని, ఈరోజు నిలదొక్కుకున్నాయని అన్నారు. జనాభాలో ప్రతి ఆరుగురిలో ఒకరు సహకార సంఘంలో సభ్యుడిగా ఉన్నారని గుర్తుచేశారు. సహకార వ్యవస్థను బలోపేతం చేయడానికి ప్రతి సహకార సంఘం సభ్యుడు, సిబ్బంది కలిసికట్టుగా కృషి చేయాలని కోరారు.
, కార్యక్రమంలో నాబార్డ్ జిల్లా అభివృద్ధి అధికారి టి .నాగార్జున, డిసిసిబి ఇన్ఛార్జ్ సిఇఓ చిప్పాడ ఉమామహేశ్వర రావు, జనరల్ మేనేజర్ కెవివి సత్యనారాయణ, డిప్యూటీ రిజిస్ట్రార్ రమణ మూర్తి,
సిబ్బంది పాల్గొన్నారు.