సిపిఐ పార్టీ అల్లూరి జిల్లా కార్యదర్శి సత్యనారాయణ. చింతపల్లి, జికేవిది మండలాల కార్యదర్శులు పోతురాజు, సత్తిబాబు
విశాలాంధ్ర – చింతపల్లి(అల్లూరి సీతారామరాజు జిల్లా) : భారత కమ్యూనిస్టు పార్టీ అల్లూరి జిల్లా సర్వసభ్య సమావేశం చింతపల్లిలో శనివారం నిర్వహించనున్న శుభ సందర్భంగా పార్టీ శ్రేణులు, అభిమానులంతా విధిగా హాజరుకావాలని సిపిఐ పార్టీ అల్లూరు జిల్లా కార్యదర్శి పొట్టిక సత్యనారాయణ అన్నారు. శుక్రవారం చింతపల్లి వచ్చిన ఆయన ఆ పార్టీ చింతపల్లి, జికేవీధి మండలాల కార్యదర్శులు పేట్ల పోతురాజు, కంకిపాటి సత్తిబాబు లతో కలిసి విలేకరులతో మాట్లాడుతూ అల్లూరి జిల్లాలో పార్టీనీ మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా జిల్లా సర్వసభ్య సమావేశం నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పార్టీ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ, సహాయ కార్యదర్శి జెవి సత్యనారాయణమూర్తి, రైతు సంఘం ప్రధాన కార్యదర్శి కె.వి.ప్రసాద్ లు విచ్చేయుచున్నందున జిల్లా లోని పార్టీలో అన్ని విభాగాలకు సంబంధించిన శ్రేణులు, అభిమానులంతా విధిగా హాజరై సమావేశాన్ని విజయవంతం చేయాలని కోరారు.