జిల్లా ఎస్పీ చెక్కు అందజేత
విశాలాంధ్ర – అనంతపురం : అనంతపురం జిల్లా తాడిపత్రిలో హోంగార్డుగా పని చేస్తూ పదవీ విరమణ పొందిన డి.వెంకటసుబ్బమ్మకు జిల్లా ఎస్పీ పి.జగదీష్ శుక్రవారం రూ. 4,39,200/- చెక్కును అందజేశారు. జిల్లా హోంగార్డుల ఒక రోజు వేతనంలో ఈ మొత్తాన్ని ఇచ్చారు. పదవీ విరమణ పొందిన మహిళకు ఆర్థిక సాయం అందించేందుకు దోహదపడిన జిల్లా హోంగార్డులను ఎస్పీ అభినందించారు. ఈకార్యక్రమంలో అదనపు ఎస్పీ డి.వి.రమణమూర్తి, ఆర్ ఐ మధు తదితరులు పాల్గొన్నారు.