Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri deneme bonusu bonus veren siteler deneme bonusu veren siteler deneme bonusu veren siteler https://lexilight.com casino siteleri https://www.paletdepom.com.tr
Sunday, September 29, 2024
Sunday, September 29, 2024

భార్య మృతిని జీర్ణించుకోలేక భర్త రైలు కింద పడి ఆత్మహత్య

విశాలాంధ్ర – ధర్మవరం:: నియోజకవర్గంలోని బత్తలపల్లి మండలం తంబాపురం గ్రామంలోని సాకే లక్ష్మన్న తన భార్య సాకే లక్ష్మమ్మను మద్యం తాగేందుకు డబ్బులు ఇవ్వలేదన్న కోపంతో రోకలిబండతో కొట్టి చంపి వేయడం జరిగింది. తాగిన మత్తులో ఈ పని చేయడం రెండు రోజుల తర్వాత భార్య చనిపోయిందన్న విషయాన్ని తెలుసుకొని, మద్యం మత్తులో తాను తప్పు చేశానని తలంచి, తాను చెన్నై కొత్తపల్లి మండలం దగ్గర తుమ్మల గరండాబాలు-చెన్నై కొత్తపల్లి రైల్వే స్టేషన్ మధ్యలో చిన్న కుంటపల్లి గ్రామంలోని రైలు పట్టాల వద్ద ఆత్మహత్య చేసుకున్నాడు. తదుపరి స్థానికులు, రైల్వే కీమెన్ సమాచారం మేరకు ధర్మవరం జి ఆర్ పి పోలీసులకు సమాచారం అందింది. సమాచారం అందుకున్న జి ఆర్ పి పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని, మృతదేహాన్ని ధర్మవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తదుపరి మృతదేహం యొక్క ఫోటోలు సోషల్ మీడియాకు సచివాలయ కార్యాలయాలకు పంపించడం జరిగింది. దీంతో మృతి చెందిన వ్యక్తి యొక్క ఆధారాలను లభ్యం కావడంతో, జి ఆర్ పి పోలీసులు కేసు నమోదు చేశారు. సోషల్ మీడియా సచివాలయ వ్యవస్థ ద్వారా ట్రేస్ అవుట్ కావడం పట్ల అధికారులు కృతజ్ఞతలను తెలియజేశారు. అనంతరం చిన్నకుంటపల్లి సర్పంచ్ కూడా చనిపోయిన వ్యక్తి మా ఊరికి చెందిన వ్యక్తి అని తెలపడంతో, కుటుంబ సభ్యులకు సమాచారాన్ని అందించారు. తదుపరి సవ పరీక్ష అనంతరం మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. కేవలం ఒక్క రోజులోనే కేసును చేదించడం పట్ల జి ఆర్ పి పోలీసులు కు ప్రజలు కృతజ్ఞతలు తెలియజేశారు. మొత్తం మీద మద్యం అనేది భార్యాభర్తల నడుమ అనుబంధాలను విడదీసి, కేవలం మద్యానికి డబ్బు ఇవ్వలేదన్న కోపంతో, తాగిన మత్తులో కట్టుకున్న భార్యని హతమార్చడం, తదుపరి రోజులలో జరిగిన విషయాన్ని తలుచుకొని, ఇక నేను ఎవరి కోసం బతకాలి అన్న మానసిక బాధతో రైలు కిందపడి మృతి చెందడం జరిగిందని పలువురు చెబుతున్నారు. అంతేకాకుండా తన భార్యను తాను చంపడం, పోలీసుల కేసు కూడా అవుతుందన్న విషయాన్ని కూడా తేల్చుకొని మృతి చెందడం అందరినీ కలిసివేసింది. జీవితకాలం అన్యోన్యంగా బ్రతకాల్సిన భార్యాభర్తల యొక్క పరిస్థితి ఇలా ఉండడం చాలా బాధాకరమని పలువురు తెలుపుతున్నారు. ఏది ఏమైనా మద్యానికి బానిసైన వారు పలు రకాలుగా మృతి చెందడం జరుగుతున్నది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img