Thursday, May 9, 2024
Thursday, May 9, 2024

మేడేను విజయవంతం చేయాలి : సిపిఐ పార్టీ మండల కార్యదర్శి జమ్మి శ్రీనివాసరావు

విశాలాంధ్ర – కొయ్యలగూడెo : ( ఏలూరు జిల్లా) : కార్మికుల నిర్ణిత పని గంటలు చేసిన ప్రాణ త్యాగాల ఫలితమే “మే “డే” అని సిపిఐ పార్టీ మండల కార్యదర్శి జమ్మి.శ్రీనివాసరావు పేర్కొన్నారు. కొయ్యలగూడెం పట్టణంలో శనివారం ఏఐటీయూసీ ముఠా కార్మికులతో శ్రీనివాసరావు సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ “మే “డే” ను విజయవంతం చేయాలని,ప్రపంచవ్యాప్తంగా కార్మికులు ఐక్యంగా హక్కుల సాధనకు నిర్వహించిన సంఘటిత పోరాటాల ఫలితమే నేటి కార్మికుల చట్టాలని తెలిపారు. కార్మికులంతా ఏకమై మే డే ను విజయవంతంగా నిర్వహించాలని శ్రీనివాసరావు కార్మికులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వెలగా రామారావు,మట్ట. రామకృష్ణ, వెలగా. నాని,లక్ష్మణరావు, అయినపర్తి. మహేష్, మూర్తి,శివ, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img