Tuesday, May 7, 2024
Tuesday, May 7, 2024

ఈవీఎంలు, వీవీప్యాట్లపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం

ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్లు (ఈవీఎంలు), ఓటరు వేరిఫైబుల్ పేపర్ ఆడిట్ ట్రయిల్ (వీవీప్యాట్)‌ల విషయంలో దాఖలైన పిటిషన్లపై సర్వోన్నత న్యాయస్థానం శుక్రవారం కీలక నిర్ణయం వెలువరించింది. వీవీప్యాట్ల స్లిప్పులతో ఈవీఎంల్లో పోలైన 100 శాతం ఓట్లను సరిపోల్చాలని, బ్యాలెట్ విధానంలో ఎన్నికలు జరిగేలా ఆదేశించాలన్న పిటిషనర్ల వాదనను తిరస్కరించింది. ప్రజాస్వామ్యం అనేది భిన్నమైన మూలస్తంభాల మధ్య సామరస్యం, విశ్వాసంతో కూడుకున్నదని ఈ సందర్భంగా జస్టిస్ట్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తాలతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. అయితే, ఫలితాల ప్రకటన తర్వాత ఇంజనీర్ల బృందంతో ఈవీఎంల మైక్రోకంట్రోలర్ ప్రోగ్రామ్‌ను తనిఖీ చేసేందుకు మాత్రం అనుమతించింది. ప్రజాస్వామ్యం అంటే సామరస్యాన్ని నెలకొల్పడానికి కృషి చేయడం.. ఎన్నికల ప్రక్రియపై గుడ్డిగా అపనమ్మకం పెంచుకోవడం అనవసర అనుమానాలకు దారి తీస్తుంది్ణ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తా ఒకే విధమైన అభిప్రాయం వ్యక్తం చేసినా.. కానీ వేర్వేరు తీర్పులను వెలువరించారు. సమతుల్య దృక్పథం ముఖ్యమైనది.. అయితే, ఒక వ్యవస్థను గుడ్డిగా అనుమానించడం అనవసరమైన అనుమానాలను పెంచుతుంది.. అందువల్ల, అర్థవంతమైన విమర్శ అవసరం.. అది న్యాయవ్యవస్థ, శాసనసభ మొదలైనవి కావచ్చు. ప్రజాస్వామ్యం అనేది అన్ని స్తంభాల మధ్య సామరస్యం, నమ్మకాన్ని కొనసాగించడం. విశ్వాసం, సహకార సంస్కృతిని పెంపొందించడం ద్వారా మన ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయవచ్చు్ణ జస్టిస్ దత్తా తన తీర్పులో పేర్కొన్నారు. అయితే, ఎన్నికల కమిషన్‌కు సుప్రీంకోర్టు రెండు ఆదేశాలు జారీ చేసింది.

ఈవీఎంలో చిహ్నాలను లోడ్ చేసిన తర్వాత, సింబల్ లోడింగ్ యూనిట్‌ను సీలు చేసి కంటైనర్‌లలో భద్రపరచాలని సూచించింది. ాఅభ్యర్థులు, వారి ప్రతినిధులు సీల్‌పై సంతకం చేయాలి.. ఫలితాల ప్రకటన తర్వాత కనీసం 45 రోజుల పాటు ఎస్‌ఎల్‌యుల ఉన్న సీల్డ్ కంటైనర్‌లను ఈవీఎంలతో పాటు స్టోర్‌రూమ్‌లలో ఉంచాలి అని కోర్టు తెలిపింది.

ఫలితాల వెల్లడించిన ఇద్దరు లేదా ముగ్గురు అభ్యర్ధుల లిఖితపూర్వక విజ్ఞ‌పన మేరకు ఇంజనీర్ల బృందంతో ఈవీఎంల మైక్రోకంట్రోలర్ ప్రోగ్రామ్‌ను తనిఖీ చేయాలంది. అయితే, ఫలితాలు ప్రకటించిన వారం రోజుల్లోపే అభ్యర్థులు విజ్ఞ‌ప్తి చేసుకోవాల్సి ఉంటుందని పేర్కొంది. దీనికి అయ్యే ఖర్చును అభ్యర్థించే వ్యక్తి భరించాల్సి ఉంటుంది.. ఈవీఎంలు ట్యాంపర్ అయినట్లు తేలితే ఆ ఖర్చులను తప్పనిసరిగా వాపసు చేయాలని ధర్మాసనం ఉద్ఘాటించింది.

ఈవీఎంలపై వేసిన ప్రతి ఓటును వీవీప్యాట్ సిస్టమ్ ద్వారా రూపొందించిన పేపర్ స్లిప్‌లతో క్రాస్ వెరిఫై చేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. ప్రస్తుతం, ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ర్యాండమ్‌గా ఎంపిక చేసిన ఐదు ఈవీఎంలను మాత్రమే పరిశీలిస్తున్నారు. ఇది ఎన్నికల నియంత్రణ అధికారం కాదని, రాజ్యాంగబద్ధమైన అధికార సంస్థ అయిన ఎన్నికల సంఘం పనితీరును నిర్దేశించలేమని సుప్రీంకోర్టు గతంలో పేర్కొంది. ఇది కేవలం అనుమానంతో పని చేయగలదా అని కూడా వ్యాఖ్యానించింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img