Friday, May 3, 2024
Friday, May 3, 2024

తన్నీరు పై అసత్య ఆరోపణలు చేస్తే ఖబడ్దార్ – షేక్ రన్ హుస్సేన్

విశాలాంధ్ర- వత్సవాయి: నానాటికి జనాల్లో పెరుగుతున్న ఆదరణను చూసి ఓర్వలేకే స్నేహశీలి విద్యా సంస్థల అధినేత ,మృదుస్వభావి అయిన కేడిసిసి చైర్మన్ తన్నీరు నాగేశ్వరరావు పై అసత్య ఆరోపణలు చేయడం సబబు కాదని అన్నారు…. రాష్ట్ర ప్రభుత్వ విప్ జగ్గయ్యపేట శాసనసభ్యులు శ్రీ సామినేని ఉదయభాను అనుచరుల్లో ప్రథమంగా ఉంటూ పార్టీకి విశిష్ట సేవలు చేశారంటంలో ఎలాంటి అతిశయోక్తి లేదని ప్రస్తుత రాజకీయ పరిణామాలను దృష్టిలో పెట్టుకొని తెదేపా వర్గీయులు బురదజల్లే కార్యక్రమంలో నిమగ్నమయ్యారని పేర్కొన్నారు…… తెలుగు దేశ ప్రభుత్వం హయాంలో హామీలను ఇచ్చి మాజీ ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు వారి తనయుడు లోకేష్ ను దొడ్డి దారిలో మంత్రిని చేసిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వానికి ఉంది కానీ వైకాపా నాయకులు నిస్వార్ధంగా నిజాయితీగా రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో స్థానిక శాసనసభ్యులు సామినేని ఉదయభాను సూచనల మేరకు ఎక్కడ అవినీతికి పాల్పడకుండా ప్రజాసేవే లక్ష్యంగా పనిచేస్తున్నారని…. జిల్లాకు సుపరిచితులైన తన్నీరు నాగేశ్వరరావు వెనుక దారి నుండి పదవి పొందాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించారు… జిల్లా స్థాయిలో కేడీసీసీ బ్యాంకు ల అభివృద్ధి చూసి మరియు ఆయనకు పెరుగుతున్న ప్రజాదరణ చూసి ఓర్వలేక ప్రతిపక్ష పార్టీలు కుయుక్తులతో అప్రతిష్ట పాలు చేసే విధంగా వ్యాఖ్యానించినట్లయితే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని జగ్గయ్యపేట నియోజకవర్గ వైకాపా ముస్లిం మైనార్టీ అధ్యక్షులు షేక్ రన్ హుస్సేన్ హెచ్చరించారు….

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img