Friday, May 3, 2024
Friday, May 3, 2024

రాష్ట్రీయ బ్రాహ్మణ కోర్ కమిటీ జిల్లా జనరల్ సెక్రటరీగా ప్రకాష్ నందిరాజు నియామకం..

విశాలాంధ్ర- నందిగామ రూరల్ న్యూస్:-రాష్ట్రీయ బ్రాహ్మణ సంఘటన వ్యవస్థాపక అధ్యక్షులు, బ్రాహ్మణ కార్పొరేషన్ మాజీ చైర్మన్,టిడిపి రాష్ట్ర ఉపాధ్యక్షులు వేమూరి ఆనంద్ సూర్య ఆదేశాల మేరకు ఆర్ బి ఎస్ డీ ఎ సి కమిటీ ఎన్టీఆర్ జిల్లా జనరల్ సెక్రెటరీగా నందిరాజు ప్రకాష్ ను నియమించడం జరిగిందని తెలిపారు ఈ సందర్భంగా సభ్యులు గూడూరి హనుమంతరావు, గార్లపాటి విజయకుమార్, వారణాసి దుర్గా సారథి చేతుల మీదుగా రాష్ట్రీయ బ్రాహ్మణ సంఘటన కోర్ కమిటీ సభ్యునిగా మరియు ఎన్టీఆర్ జిల్లా జనరల్ సెక్రటరీగా నందిగామ నివాసి ప్రకాష్ నందిరాజు ను నియమించి వారికి నియామక పత్రాన్ని విజయవాడలో జాతీయ కార్యాలయం గురువారం అందజేసినారు. ఈ సందర్భంగా ప్రకాష్ నందిరాజు మాట్లాడుతూ వేమూరి ఆనంద సూర్య నాయకత్వంలో గతంలో నందిగామ నియోజకవర్గ అధ్యక్షుడిగా తన టీం తో తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు ఏర్పాటుచేసిన బ్రాహ్మణ కార్పొరేషన్ ద్వారా బ్రాహ్మణ కుటుంబాలకు పలు విధమైన సంక్షేమ పథకాలు ద్వారా లబ్ది చేకూర్చామని అట్లాగే ఆర్ బి ఎస్ టీమ్ రేపు రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం మరియు జనసేన పార్టీల విజయానికి కృషి చేస్తూ తద్వారా బ్రాహ్మణ కార్పొరేషన్ పునర్ వైభవం ద్వారా మరల అనేక సంక్షేమ పథకాలను అర్హులైన బ్రాహ్మణులందరకు లబ్ధి చేకూరిలా కృషి చేస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నందిగామ నియోజకవర్గ అధ్యక్షురాలు కల్పన నందిరాజు, అందుకూరి శ్రీమన్నారాయణ,మీడియా కోఆర్డినేటర్ కె.సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img