ఓటరు జాబితాలో అవకతవకలపై సీఈసీకి ఫిర్యాదు చేశామని తెదేపా అధినేత చంద్రబాబు తెలిపారు. నొవోటెల్ హోటల్ లో సీఈసీ అధికారులతో టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కల్యాణ్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా వైకాపా ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తోంది. ప్రతిపక్ష పార్టీలు, నాయకులే లక్ష్యంగా కేసులతో వేధిస్తోంది. వాలంటీర్లతో ఎన్నికలు నిర్వహించాలని చూస్తున్నారు. బీఎల్వోలుగా మహిళా పోలీసులను పెట్టారు. వై ఏపీ నీడ్స్ జగన్కు కలెక్టర్లతో ప్రచారం చేయిస్తున్నారు. ప్రజల తిరుగుబాటు చూసి నకిలీ ఓటర్లను చేర్చే ప్రయత్నం చేస్తున్నారు. వైకాపా అరాచకాలను సీఈసీకి వివరించాం. తగిన విధంగా చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు అని చంద్రబాబు అన్నారు.