విశాలాంధ్ర – కొయ్యలగూడెం (ఏలూరు జిల్లా) : డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఆలోచన పై అవగాహన సదస్సు ను ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం పట్టణంలో రోటరీ క్లబ్ వద్ద ఈనెల 28వ తేదీ శనివారం నిర్వహిస్తున్నట్లు, మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు బొగ్గవరపు బాబురావు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ యొక్క సదస్సుకు ముఖ్య అతిథులుగా బొనిగల రామారావు, చాగంటి సంజీవరావు, అలాగా రవికుమార్, అలుగు ఆనంద శేఖర్, గెడ్డం శామ్యూల్ జాషువా, కాపు దాసి రవికుమార్, ఎరికపాటి విజయ్, సొబ్బన మోహన్, అందుగుల ఫ్రాన్సిస్ హాజరవుతున్నారని, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు చెందిన వారు, ఈ యొక్క అంబేద్కర్ ఆలోచన అవగాహన సదస్సులో పాల్గొనాలని బాబురావు పేర్కొన్నారు.