Wednesday, June 25, 2025
Homeఅంతర్జాతీయంమరో శాస్త్రవేత్తను కోల్పోయిన ఇరాన్‌

మరో శాస్త్రవేత్తను కోల్పోయిన ఇరాన్‌

తెహ్రాన్‌: ఇరాన్‌పై ఇజ్రాయిల్‌ దాడుల్లో మరొక అణు శాస్త్రవేత్త సయ్యద్‌ మహమ్మద్‌ రెజా సిద్దీఖీ సాబీర్‌ ప్రాణాలు కోల్పోయారు. తమ అణు కార్యక్రమంలో కీలకమైన శాస్త్రవేత్తను కోల్పోయినట్లు ఇరాన్‌ అధికారిక మీడియా వెల్లడిరచింది. సయ్యద్‌ ఉత్తర ఇరాన్‌లోని ఆస్తనేప్‌ా యె అష్రాఫియాలోని తల్లిదండ్రుల ఇంట్లో ఉన్నప్పుడు దాడి జరిగిందని తెలిపింది. ఆయన 17 ఏళ్ల కుమారుడు కూడా ఇజ్రాయిల్‌ దాడిలో చనిపోయారని వెల్లడిరచింది. సయ్యద్‌ మహమ్మద్‌ రెజా ఇరాన్‌ ఆర్గనైజేషన్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ ఇన్నోవేషన్‌ రీసెర్చ్‌కు చెందిన షహిద్‌ కరీమి గ్రూప్‌నకు అధిపతి. న్యూక్లియర్‌ ఎక్స్‌ప్లోజివ్స్‌ తయారీ ప్రాజెక్టులో ముఖ్యలు. ఇస్ఫహాన్‌, ఫోర్డో, నతాంజ్‌ అణు కేంద్రాలపై 14 బంకర్‌బస్టర్‌ బాంబులతో తాము దాడి జరగడంతో అణు కార్యక్రమం తీవ్రంగా దెబ్బతిందని అమెరికా ప్రకటించడం విదితమే.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు