Homeవ్యాపారంమెడ్ట్రానిక్, అపోలో హాస్పిటల్స్‌ వ్యూహాత్మక భాగస్వామ్యం

మెడ్ట్రానిక్, అపోలో హాస్పిటల్స్‌ వ్యూహాత్మక భాగస్వామ్యం

- Advertisement -

హైదరాబాద్: ఆరోగ్య సంరక్షణ టెక్నాలజీలో ప్రపంచ అగ్రగామి అయిన మెడ్ట్రానిక్, అపోలో హాస్పిటల్స్‌, జూబ్లీ హిల్స్‌లోని అపోలో హాస్పిటల్స్‌లో 11 పడకల అత్యాధునిక ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఐసియు) అయిన “ఐసియు ఆఫ్ ది ఫ్యూచర్”ను ప్రారంభించినట్లు ప్రకటించాయి. ఈ కొత్త కేంద్రం, మెడ్ట్రానిక్ అధునాతన అక్యూట్ కేర్ అండ్ మానిటరింగ్ (ఏసీఎం) టెక్నాలజీలు, పరిష్కారాలతో పూర్తిగా అనుసంధానించబడుతుంది. ఇది సహకార ఆరోగ్య సంరక్షణ ఆవిష్కరణలో ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలుస్తుంది. జూబ్లీ హిల్స్‌ క్యాంపస్‌లో జరిగిన ఒక అధికారిక ప్రారంభోత్సవ కార్యక్రమంలో అపోలో హాస్పిటల్స్‌ గ్రూప్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ సంగీతా రెడ్డి, అపోలో హెల్త్యాకిస్స్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మన్ప్రీత్ సింగ్, మెడ్ట్రానిక్ మేనేజింగ్ డైరెక్టర్, వైస్ ప్రెసిడెంట్`ఇండియా సబ్కాంటినెంట్ కంట్రీస్ మన్దీప్ సింగ్ కుమార్ ఈ అవగాహన ఒప్పందం (ఎంఓయూ)పై అధికారికంగా సంతకాలు చేశారు. మెడ్ట్రానిక్ ఏసీఎం బృందం సహకారంతో అభివృద్ధి చేయబడిన ఈ చొరవ, క్లిష్టమైన సంరక్షణ మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడంలో మరియు సహకార ఆరోగ్య సంరక్షణ ఆవిష్కరణలను ముందుకు తీసుకెళ్లడంలో ఒక ముందడుగును సూచిస్తుంది. ఈ సమీకృత ఐసీయమూ, వైద్యులు, సాంకేతిక నాయకుల మధ్య సన్నిహిత సహకారాన్ని పెంపొందిస్తూ, మారుతున్న వైద్య అవసరాలకు మద్దతు ఇచ్చేలా రూపొందింది. వైద్య నైపుణ్యం, అధునాతన సాంకేతికతలను ఒకచోట చేర్చడం ద్వారా, ఈ సహకారం మరింత సమాచారంతో కూడిన సంరక్షణను అందించడంలో సహాయపడటం, రోగి ఫలితాలను మెరుగుపరచడానికి దోహదపడటం లక్ష్యంగా పెట్టుకుంది.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు