Thursday, April 10, 2025
Homeఅంతర్జాతీయంవ్యవసాయ సవాళ్లకు ప్రాధాన్యత

వ్యవసాయ సవాళ్లకు ప్రాధాన్యత

ఐరాస వాతావరణ సదస్సుకు రైతుల వినతి
బకు: వ్యవసాయ రంగంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, సవాళ్లకు వాతావరణ చర్చల్లో ప్రాధాన్యత ఇవ్వాలని ఐక్యరాజ్య సమితి (ఐరాస)కు అన్నదాతలు విజ్ఞప్తి చేశారు. తమ కష్టాలను చూసి చూడనట్లు వదిలేయొద్దని బతిమిలాడుకున్నారు. ఐక్యరాజ్య సమితి వాతావరణ సదస్సులో వ్యవసాయంపై ప్రధానంగా దృష్టిని కేంద్రీకరించాలని కోరారు. సముచిత వాతావరణ నిధులు కేటాయిస్తుందని ప్రపంచానికి అన్నం పెట్టే చిరు రైతులకు ఆసరాగా నిలవాలని విన్నవించారు. మీరు సన్నకారు రైతులకు మద్దతు ఇవ్వకపోతే మీకు ఆహారం ఎక్కడ నుంచి వస్తుంది? ఆదుకోకపోతే మీ కోసం పంటలను ఎవరు సాగు చేస్తారు? మీ కోసం చేపలు పట్టేది ఎవరు? తెనే, కూరగాయాలు ఎలా వస్తాయి? అని ఆసియా రైతుల సమాఖ్య ప్రధాన కార్యదర్శి ఈస్తర్‌ పెనునియా ప్రశ్నించారు. అధిక ఉష్ణోగ్రతలు, అకాల వర్షాలు వంటి ప్రతికూల వాతావరణ పరిస్థితుల ప్రభావం రైతాంగంపై తీవ్రంగా ఉంటోందని… ఆదాయం లేక ధాన్యం, కొబ్బంది, కూరగయాలు పండిరచే చిన్న రైతులు ఇబ్బంది పడుతున్నారని వెల్లడిరచారు. సేద్యానికి తగు వాతావరణ సాయం ఇవ్వాలని, నిధులు కేటాయించాలని డిమాండ్‌ చేశారు. ప్రస్తుతానికి వాతావరణ సాయంలో ఒక శాతం కంటే తక్కువ చిన్న రైతులకు అందుతున్నట్లు క్ల్రైమేట్‌ పాలసీ ఇనిషియేటివ్‌ నివేదిక పేర్కొంది. భూమి వేడెక్కుతుండటంతో ఎదురవుతున్న సవాళ్లు అధిగమించేందుకు రైతులు ప్రయత్నిస్తున్నారు. ఇలాంటి సమయంలో వారికి చేయూత అవసరమన్నారు. గతసారి జరిగిన ఐరాస వాతావరణ చర్చల్లో రైతుల సమస్యలకు తగు ప్రాధాన్యత దక్కలేదు కాబట్టి కనీసం ఈసారి సముచిత ప్రాధాన్యత ఇచ్చి పరిష్కారం చూపాలని రైతులు కోరుతున్నారు. ఇప్పటికైనా తమ గోడును వింటారని ఆశిస్తున్నట్లు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు