Tuesday, June 24, 2025
Homeవిశ్లేషణసంధికి పుతిన్‌, జిన్‌పింగ్‌ యత్నం

సంధికి పుతిన్‌, జిన్‌పింగ్‌ యత్నం

నిత్య చక్రవర్తి

ఇజ్రాయిల్‌`ఇరాన్‌ల మధ్య యుద్ధం శుక్రవారానికి 8వ రోజుకి చేరింది. ఏమాత్రం ఎవరికీ తెలియకుండా ఇజ్రాయిల్‌ సైన్యం ఇరాన్‌ మీద దాడిచేసింది. గత 24గంటల్లో కొన్ని ప్రధానమైన పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఇరాన్‌ను ప్రత్యేకించి తెహ్రాన్‌ నగరాన్ని వీలైనంత త్వరగా ధ్వంసంచేయాలని ఇజ్రాయిల్‌ నిర్ణయించుకుంది. అమెరికాకు తెలిసే ఇజ్రాయిల్‌ దాడి జరిపింది. ఈ నేపథó్యంలో రష్యా అధ్యక్షుడు వ్లదిమీర్‌ పుతిన్‌, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ యుద్ధం నిలిపివేసేందుకు సంయుక్తంగా ఒక వ్యూహాన్ని పన్ని రెండు దేశాల మధ్య సంధి కుదిర్చేందుకు ప్రయత్నిస్తున్నారు. గురువారం ఇద్దరు నేతలు మాట్లాడుకున్నారు. ఇజ్రాయిల్‌ దాడిని పుతిన్‌, జిన్‌పింగ్‌ తీవ్రంగా ఖండిరచారు. ఇరాన్‌కు వ్యతిరేకంగా ఇజ్రాయిల్‌తో కలిపి యుద్ధంలో జోక్యం చేసుకోవద్దని పుతిన్‌, జిన్‌పింగ్‌ అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కి సూచించారు. పుతిన్‌, జిన్‌పింగ్‌ సంధి కుదిర్చేందుకు ప్రయత్నిస్తున్నందున ట్రంప్‌ యుద్ధరంగంలోకి దిగడంలేదు. ఇరాన్‌కి పాకిస్థాన్‌ మద్దతు తెలియజేసినందున ట్రంప్‌ కెనడా నుంచి ఆఘమేఘాల మీద అమెరికాకు చేరుకుని పాకిస్థాన్‌ ఫీల్డ్‌ మార్షల్‌ అసీం మునీర్‌తో మాట్లాడుతున్నారు. అంతేకాదు, యుద్ధరంగంలోకి దిగవద్దని ట్రంప్‌ రెండు రోజుల క్రితమే పాకిస్థాన్‌కు సూచించారు.
పుతిన్‌, జిన్‌పింగ్‌ రంగంలోకి దిగినందున ట్రంప్‌ వెనకాడే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. తక్షణం కాల్పుల విరమణ చేయాలని కోరుతూ చైనా నాలుగు అంశాల సూత్రాన్ని ప్రతిపాదించింది. అదేసమయంలో సమస్య పరిష్కారానికి అణుశక్తి అంశంపై చర్చలను కూడా చైనా సూచించింది. మరో ముఖ్యమైన పరిణామం కూడా చోటుచేసుకుంది. ఇరాన్‌ విదేశాంగ మంత్రి బ్రిటన్‌, ఫ్రాన్స్‌, జర్మనీ కలిసి శుక్రవారం జెనీవాలో చర్చలకు రావలసిందిగా ఆహ్వానించగా, ఆయన వెంటనే అంగీకరించారు. ఒకవైపు సాయుధ ఘర్షణ జరుగుతుండగా, మరోవైపు విదేశాంగ మంత్రులు చర్చలు జరుపుతున్నారు. ఇరాన్‌పై ఇజ్రాయిల్‌తో కలిసి యుద్ధంలో పాల్గొనకుండా మరో రెండు వారాలపాటు ట్రంప్‌ వాయిదా వేశారు. ఈ వారం ఆదివారమే యుద్ధంలోకి దిగాలని ట్రంప్‌ నిర్ణయించుకోగా చైనా, రష్యాల ప్రతిపాదనతో ఆయన వెనక్కుతగ్గారు.
ట్రంప్‌ యుద్ధంలోకి వెంటనే దిగరాదని బుధవారమే రెండువారాలు వాయిదా వేశారు. చైనా, రష్యాలు సంయుక్తంగా ఇజ్రాయిల్‌ను ఖండిరచాయి. రెండు దేశాలు కలిసి సంధి కుదర్చడానికి మరో కొన్ని కీలకమైన సైనిక అంశాలుకూడా ఉన్నాయని తెలుస్తోంది. ఇజ్రాయిల్‌పై ఇరాన్‌ ఇంతవరకు అత్యంత శక్తిమంతమైన క్షిపణులను వినియోగించలేదని సంధి కుదరకపోతే అలాంటి క్షిపణులను వినియోగించేందుకు ఇరాన్‌ కీలకమైన నాయకుడు అయతుల్లా ఖామేని నిర్ణయించినట్లుకూడా తెలుస్తోంది. చైనా, రష్యాల నుంచి మరింత శక్తిమంతమైన ఆయుధాలు ఇరాన్‌కు చేరనున్నాయని తెలిసిన నేపథó్యంలో పెంటగాన్‌ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. లండన్‌ నుంచి వెలువడే గార్డియన్‌ తాజా విశ్లేషణను ప్రకటించింది. ఇరాన్‌ క్షిపణులపై దాడిచేసేందుకు ఇజ్రాయిల్‌ ఇంటర్‌సెప్ట్టర్‌లను (ఈ ఆయుధాలను మధ్యలోనే ధ్వంసం చేయవచ్చు) ఇజ్రాయిల్‌ ఉపయోగించనున్నదని గార్డియన్‌ తెలిపింది. యుద్ధం ఇంకా కొనసాగినట్లయితే ఇజ్రాయిల్‌ వద్ద అత్యంత శక్తిమంతమైన ఇంటర్‌సెప్టర్‌లు దాదాపు ముగిసిపోయాయని, అయితే ఇది ఇరాన్‌ వద్ద ఉన్నాయని గార్డియన్‌ తెలిపింది. అమెరికా ఇజ్రాయిల్‌కు అనుకూలంగా జోక్యం చేసుకోకపోతే, యుద్ధంలో ఇజ్రాయిల్‌ విజయంసాధించే అవకాశాలు లేవని కొన్ని వర్గాలు ప్రకటిస్తున్నాయి. తక్షణం నిర్ణయం తీసుకుని ట్రంప్‌ యుద్ధంలో పాల్గొనాలని ఇజ్రాయిల్‌ పాలకుడు నెతన్యాహు బ్రతిమలాడుతున్నాడు. ఈ ఇద్దరు నాయకులు ఒకే విధమైన ఆలోచన చేస్తున్నప్పటికీ వ్యూహంలో విభేదిస్తున్నారు. సంధి కుదిర్చే విషయంలో చైనా, రష్యా గట్టి నిర్ణయాన్ని తీసుకున్నాయి.
చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌, రష్యా అధ్యక్షుడు పుతిన్‌ను ఇజ్రాయిల్‌, ఇరాన్‌ యుద్ధానికి దూరంగా ఉంచేందుకు ట్రంప్‌ తీవ్రంగా ప్రయత్నించారు. అయితే జిన్‌పింగ్‌ పశ్చిమాసియాలో ట్రంప్‌ విధానాన్ని బహిరంగంగా సవాలు చేశారు. అయితే కాల్పుల విరమణకు ప్రత్యామ్నాయ ప్రతిపాదనను జిన్‌పింగ్‌ ముందుకు తెచ్చారు. ప్రజాసమూహాల పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యతను ఇవ్వాలని సంప్రదింపులు, చర్చల ద్వారా మౌలికమైన పరిష్కారాలను అంతర్జాతీయ సమాజం శాంతికోసం కృషిచేయవలసిన అవసరం ఉంది. పుతిన్‌తో చర్చించి ఫార్ములాను రూపొందించనున్నారు. చైనా, రష్యా నాయకులు సమన్వయంతో వ్యూహాత్మక సహకారాన్ని అనుసరించడంతోపాటు అంతర్జాతీయ సమాజానికి స్పష్టమైన సందేశాన్ని పంపనున్నారు. ఉద్రిక్తతలను సడలించి ప్రాంతీయ ప్రజారక్షణకు ఇద్దరునేతలు పిలుపునిచ్చారు. గ్లోబల్‌ టైమ్స్‌ పత్రిక శుక్రవారం సంపాదకీయంలో చైనా తన అధికారిక అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది.
ఇజ్రాయిల్‌పైన ప్రత్యేకమైన ప్రభావాన్ని చైనా కలిగి ఉంది. ఇదే సమయంలో అమెరికా నిర్మాణాత్మకమైన పాత్రను పోషించలేదు. అందుకు బదులుగా ట్రంప్‌ మంటలను మరింత పెంచుతున్నాయి. అంతేకాక, నేరుగా యుద్ధంలో పాల్గొంటానన్న సూచనను కూడా ఇవ్వడానికి ట్రంప్‌ సిద్దమయ్యారు.ఈ లోపు చైనా,రష్యా సంధికుదిర్చేందుకు సిద్ధమైన నేపథó్యంలో ట్రంప్‌ రెండువారాలు వాయిదా వేసుకున్నారు. సాయుధ సంఘర్షణ ప్రస్తుతం తీవ్రమైన స్థానానికి చేరిన నేపథó్యంలో సంక్షోభాన్ని సున్నితంగా పరిష్కరించుకోవలసిన సమయం వచ్చింది. పుతిన్‌, జిన్‌పింగ్‌ నాలుగు అంశాలతోకూడిన వ్యూహాన్ని ప్రతిపాదించారు. ఇందులో ప్రస్తుత సమస్యలను చర్చించారు. ఇరాన్‌పై దాడి జరిపిన ఇజ్రాయిల్‌ తక్షణం సైనిక కార్యకలాపాలను నిలిపివేయాలని అమాయక పౌరులకు హాని కలిగించరాదని ఇరాన్‌ అణుశక్తి సమస్యను రాజకీయంగా పరిష్కరించాలని ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదనలు అమలుచేస్తే ప్రస్తుత పరిస్థితుల్లో గణనీయమైన మార్పులు చోటుచేసుకుంటాయి. ఇజ్రాయిల్‌ క్షిపణులను పనిచేయకుండా చేసేందుకు వైమానిక రక్షణ యంత్రాలను అలాగే శక్తిమంతమైన సాంకేతిక రాడార్‌ వ్యవస్థలను చైనా ఇరాన్‌కు పంపేఅవకాశాలున్నాయి. చైనా వద్ద అత్యంత సాంకేతికపరమైన శక్తివంతమైన మిసిలీలలు ఇంకా అనేక ఆయుధాలు ఉన్నాయి. వీటిని ఇరాన్‌కు ఇచ్చినట్లయితే ఇజ్రాయిల్‌ బలహీనపడే అవకాశాలు కూడా లేకపోలేదు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు