Saturday, June 7, 2025
Homeఆంధ్రప్రదేశ్అంతరాయం లేకుండా విద్యుత్తును అందిస్తాం.. విద్యుత్ సిజిఎం వరకుమార్

అంతరాయం లేకుండా విద్యుత్తును అందిస్తాం.. విద్యుత్ సిజిఎం వరకుమార్

విశాలాంధ్ర ధర్మవరం; ధర్మవరం డివిజన్లో ఇకనుంచి అంతరాయం లేకుండా సక్రమమైన విద్యుత్తును అందిస్తామని విద్యుత్ సిజిఎం వరకుమార్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ధర్మవరం డివిజన్ నుండి అనేక ఫిర్యాదు రావడం జరిగిందని, విద్యుత్తు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తాను విచారణ నిమిత్తం రావడం జరిగిందని తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ సబ్ డివిజన్లోని సబ్ స్టేషన్ లను, వివిధ విద్యుత్ కార్యాలయాలను తనిఖీ చేయడం జరిగిందని తెలిపారు. తదుపరి ధర్మారం డివిజన్లో గాలి వానకు విద్యుత్తును ఆపడం జరుగుతోందని, అలాకాకుండా వాటి నివారణకు చేపట్టాల్సిన అంశాలపై అధికారులకు సిబ్బందికి తగిన ఆదేశాలు ఇవ్వడం జరిగిందని తెలిపారు. అదేవిధంగా ప్రమాదకరములో ఉన్నటువంటి వివిధ విద్యుత్తు పరికరాలు, ట్రాన్స్ఫారం లను వెనువెంటనే పది రోజులలో వాటిని నివారించాలన్న ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగిందన్నారు. పాత ట్రాన్స్ఫారములకు మరమ్మత్తులు చేయించుట, కొత్త ట్రాన్స్ఫార్మర్ వే నువెంటనే ఏర్పాటు చేయుట, ఎక్కడ కూడా ఎటువంటి ఫిర్యాదులు వినియోగదారుల నుంచి వస్తే కఠిన చర్యలు తప్పవు అని ఆదేశించడం జరిగిందన్నారు. ప్రమాదకరమైన పోల్స్, ట్రాన్స్ఫర్స్ వాటి పై ప్రత్యేక దృష్టిని సారించాలని తెలపడం జరిగిందన్నారు. విద్యుత్ వినియోగదారులకు ఏమైనా సమస్య ఉన్నచో కాల్ ఫ్రీ నెంబర్ 1912 కు ఫిర్యాదు చేయవచ్చునని, ఫిర్యాదును బట్టి సమస్యను తప్పకుండా పరిష్కరించడం జరుగుతుందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో డివిజన్ విద్యుత్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు