ఆ విద్యార్థి సహా 11 మంది మృతి
వియన్నా: ఆస్ట్రియాలోని ఓ పాఠశాలలో విద్యార్థి జరిపిన కాల్పుల్లో 11 మంది మృతి చెందారు. గ్రాజ్ నగరంలోని ఓ పాఠశాలలో మంగళవారం ఉదయం ఈ ఘటన జరి గింది. ఒక విద్యార్థి రెండు తరగతి గదుల్లో విచక్షణారహితంగా కాల్పులు జరుపగా 11 మంది చనిపోగా, 30 మందికిపైగా గాయప డ్డారు. గాయాలైన వారిలో విద్యార్థులు, ఉపా ధ్యాయులు ఉన్నారని అధికారులు వెల్లడిర చారు. అడ్డుకునేందుకు ప్రయత్నించిన టీచర్ పై అతను అనేకసార్లు కాల్పులు జరిపినట్లు తెలిపారు. గాయపడిన వారంతా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని, కొందరి పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు. అయితే ఆ విద్యార్థి చివర్లో తనను తాను కాల్చుకున్నట్లు వెల్లడిరచారు. అతని మృతదేహం స్కూలు టాయిలెట్లో లభ్యమైందన్నారు. కేసు నమోదు చేశామని, తదుపరి అవాంఛనీయ ఘటనల నివారణకు భద్రతా దళాలను మోహరించినట్లు అధికారి వెల్లడిరచారు.