లిస్బన్: ఇరాన్పై దాడుల్లో భాగం కావద్దని పోర్చుగల్ ప్రభుత్వానికి అక్కడి కమ్యూనిస్టు పార్టీ (పీసీపీ) పిలుపునిచ్చింది. తమ భూభాగాన్ని దురాక్రమణ కోసం అమెరికా వినియోగించుకునే అవకాశం ఇవ్వవద్దని కోరింది. శాంతి విధానానికి కట్టుబడాలని, సంఘర్షణలకు రాజకీయ పరిష్కారాలకు మద్దతు ఇవ్వాలని, యుద్ధాలు చేసేవారికి మద్దతు తగదని పీఎస్డీ/సీడీఎస్ ప్రభుత్వానికి ఒక ప్రకటనలో పీసీపీ హితవు పలికింది. 1990 నాటి గల్ఫ్ యుద్ధం, 2001లో అఫ్ఘాన్ దురాక్రమణ, 2003లో ఇరాన్ దాడుల సమయంలో లాజేస్ బేస్ను అమెరికా వినియోగించుకోవడాన్ని గుర్తుచేసింది. సైనిక ఘర్షణలు తీవ్రతరం చేయడంలో భాగస్వామ్యం కావద్దని హితవు పలికింది. దేశ సార్వభౌమత్వం, స్వాతంత్య్రం కోసం పోరాటాన్ని విస్తృతంగా సాగించడానికి ఉన్న ప్రాధాన్యతను నొక్కిచెప్పింది. శాంతి కట్టుబడాలని పీసీపీ సూచించింది. సామ్రాజ్యవాద దురాక్రమణకు బాధితులైన వారికి పోర్చుగీస్ కమ్యూనిస్టు పార్టీ సంఫీుభావం ప్రకటించింది.
ఇరాన్పై దాడుల్లో భాగం కావద్దు: పోర్చుగల్ కమ్యూనిస్టు పార్టీ
RELATED ARTICLES