విశాలాంధ్ర/హైదరాబాద్ : ఉస్మానియా జనరల్ హాస్పిటల్లో రోగుల కోసం 24/7 ప్రత్యేక హెల్ప్లైన్, రోగి సహాయక సేవలను హాస్పిటల్ సూపరింటెండెంట్ రాకేష్ సహాయ్ సమక్షంలో బీఎస్బీ హ్యూమన్ డెవలప్మెంట్ ట్రస్ట్ ప్రతినిధి సల్మాన్ బాబు ఖాన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ సేవలతో రోగులకు తక్షణ సహాయం, మార్గనిర్దేశం అందుతుందన్నారు. మా లక్ష్యం ప్రజా ఆరోగ్య వ్యవస్థను బలోపేతం చేయడమన్నారు. ఆ దిశగా ప్రభుత్వ హాస్పిటల్స్ లో రోగులకు మెరుగైన సేవలు అందించేందుకు హెల్పింగ్ హ్యాండ్ ఫౌండేషన్ వంటి సంస్థలను ప్రోత్సహిస్తున్నామని చెప్పారు. మొదటి సంవత్సరంలో 15 ప్రభుత్వ హాస్పిటల్స్ లో 80 పైగా కమ్యూనిటీ హెల్త్ వర్కర్ల సాయంతో సేవలు అందించనున్నామని చెప్పారు.