Monday, March 3, 2025
Home‘ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ’ నోటిఫికేషన్‌

‘ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ’ నోటిఫికేషన్‌

10 వరకు నామినేషన్లు, 13న ఉపసంహరణ
5 స్థానాలకు 20న పోలింగ్‌, అదేరోజు ఫలితాలు

విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : రాష్ట్రంలో శాసనసభ్యుల కోటా కింద 5 ఎమ్మెల్సీ స్థానాలకు సోమవారం నోటిఫికేషన్‌ విడుదలైంది. ఈ నెల 10వ తేదీ వరకు నామినేషన్‌ దాఖలుకు అవకాశముంటుంది. 11న నామినేషన్ల పరిశీలన, 13 నామినేషన్ల ఉపసంహ రణకు గడువు ఇచ్చారు. ఈ నెల 20న పోలింగ్‌ జరగనుండగా అదే రోజు సాయంత్రం కౌంటింగ్‌ నిర్వహిస్తారు. యనమల రామకృష్ణుడు, జంగా కృష్ణమూర్తి, దువ్వారపు రామారావు, బీటీ నాయుడు, అశోక్‌ బాబుల పదవి కాలం ఈ నెల 29తో ముగియనుంది. దీంతో ఐదు ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ స్థానాలకు సాధారణ పరిపాలనా శాఖ సీఈఓ వివేక్‌ యాదవ్‌ నోటిఫికేషన్‌ విడుదల చేశారు. కాగా ఎమ్మెల్సీ ఎన్నికల రిటర్నింగ్‌ అధి కారిగా అసెంబ్లీ డిప్యూటి సెక్రటరీ ఆర్‌ వనితా రాణిని ఎన్నికల కమిషన్‌ నియమించింది. మరో ఇద్దరు అసిస్టెంట్‌ రిటర్నింగ్‌ అధికారులను కూడా నియామించింది. సోమవారం నుంచే ఐదు ఎమ్మెల్సీ స్థానాలకు నామినేషన్లు స్వీకరిస్తారని సాధారణ పరిపాలనా శాఖ సీఈఓ వివేక్‌ యాదవ్‌ నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు