Thursday, May 8, 2025
Homeవ్యాపారంఐకానిక్‌ గోల్ఫ్‌ జీటీఐ కోసం ఫోక్స్‌వ్యాగన్‌ ప్రీ-బుకింగ్స్‌ ప్రారంభం

ఐకానిక్‌ గోల్ఫ్‌ జీటీఐ కోసం ఫోక్స్‌వ్యాగన్‌ ప్రీ-బుకింగ్స్‌ ప్రారంభం

ముంబయి: లెజెండరీ వోక్స్‌వ్యాగన్‌ గోల్ఫ్‌ జీటీఐ కోసం ప్రీ-బుకింగ్‌లు 2025 మే 5 నుంచి ప్రారంభిస్తున్నామని ఫోక్స్‌వ్యాగన్‌ ఇండియా సగర్వంగా ప్రకటించింది. తాజా తరం గోల్ఫ్‌ జీటీఐ ఎంకే 8.5తో, భారతీయ ఔత్సాహిక వినియోగదారులు పరిమిత కేటాయింపు ద్వారా ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన కార్లు శ్రేణిని మొదటిసారిగా అందుకోగలరు. దాని గొప్ప మోటార్‌స్పోర్ట్‌ వారసత్వం, కాలాతీత డిజైన్‌ భాష, ఉల్లాసకరమైన పనితీరుతో, గోల్ఫ్‌ జీటీఐ కేవలం కారు కన్నా ఎక్కువ- ఇది డైనమిక్‌ డ్రైవింగ్‌, ఐకానిక్‌ అప్పీల్‌కు చిహ్నం. గోల్ఫ్‌ జీటీఐ పూర్తిగా నిర్మించిన యూనిట్‌ (ఎఫ్‌బీయూ)గా అందుబాటులోకి వస్తోంది. ఇది వినియోగదారులకు నిజమైన జీటీఐ డీఎన్‌ఏను దాని స్వచ్ఛమైన రూపంలో అనుభవించే అవకాశాన్ని అందిస్తుందని ఫోక్స్‌వ్యాగన్‌ ఇండియా బ్రాండ్‌ డైరెక్టర్‌ ఆశిష్‌ గుప్తా తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు