Friday, June 6, 2025
Homeజులై 21 నుంచి పార్లమెంట్‌

జులై 21 నుంచి పార్లమెంట్‌

న్యూదిల్లీ: పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు జులై 21 నుంచి ప్రారంభం కానున్నాయి. ఆగస్టు 12వ తేదీ వరకు సమావేశాలు జరుగుతాయి. ఈ విషయాన్ని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖమంత్రి కిరణ్‌ రిజిజు బుధవారం ప్రకటించారు. ఆ రోజు ఉదయం 11 గంటలకు రాజ్యసభ, లోక్‌సభ సమావేశమవుతాయని వెల్లడిరచారు. సమావేశ తేదీలను రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ నేతృత్వంలోని పార్లమెంట్‌ వ్యవహారాలపై కేబినెట్‌ కమిటీ నిర్ణయించినట్లు తెలిపారు. ఆపరేషన్‌ సిందూర్‌, పహల్గాం ఉగ్రదాడిపై పార్లమెంట్‌ను ప్రత్యేకంగా సమావేశ పర్చాలని ఓ పక్క విపక్షాలు డిమాండ్‌ చేస్తుండగా…మోదీ సర్కారు మాత్రం ఏకంగా వర్షాకాల సమావేశాల తేదీలు ప్రకటించింది. విపక్షాల డిమాండ్‌పై రిజిజు స్పందిస్తూ వర్షాకాల సమావేశాల్లో అన్ని అంశాలను పార్లమెంట్‌ నిబంధనల ప్రకారం చర్చిస్తామని చెప్పుకొచ్చారు. ఆపరేషన్‌ సిందూర్‌ తదితర అంశాలపై చర్చించేందుకు పార్లమెంటు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయాలని మంగళవారం ఇండియా ఐక్యసంఘటనకు చెందిన 16 ప్రతిపక్ష పార్టీలు డిమాండ్‌ చేశాయి. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశాయి. దీనిపై దిల్లీలో జరిగిన ఇండియా సమావేశంలో కాంగ్రెస్‌ నేతలు జైరాం రమేశ్‌, దీపేందర్‌ హుడా, తృణమూల్‌ కాంగ్రెస్‌ నేత డెరెక్‌ ఓబ్రియెన్‌, రాష్ట్రీయ జనతాదళ్‌ నేత మనోజ్‌ రaా, సమాజ్‌వాదీ పార్టీకి చెందిన రామ్‌గోపాల్‌ యాదవ్‌, శివసేన (యూబీటీ) నాయకుడు సంజయ్‌ రౌత్‌ సహా పలు పార్టీల నేతలు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు