ముంబై: భారతదేశంలో అగ్రగామి వాణిజ్య వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్ తన ట్రక్ల మొత్తం శ్రేణిలో ఫ్యాక్టరీలో అమర్చబడిన ఎయిర్ కండిషనింగ్ వ్యవస్థలను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. ఈ అప్గ్రేడ్ ఎస్ఎఫ్సీ, ఎల్పీటీ, అల్ట్రా, సిగ్నా, ప్రైమా క్యాబిన్లకు విస్తరించి, తొలిసారిగా కౌల్స్ మోడళ్లకు కూడా అందుబాటులోకి వచ్చింది. పనితీరు, డ్రైవింగ్ సామర్థ్యాన్ని మరింత మెరుగుపరచేందుకు, టాటా మోటార్స్ పవర్ అవుట్పుట్ మెరుగుదలలతో కూడిన విలువ జోడిరపులను కూడా ప్రవేశపెట్టింది. ఈ చర్య ద్వారా కంపెనీ, వాహన వినియోగదారులకు ఉన్నతమైన డ్రైవింగ్ అనుభవాన్ని అందించడంలో తన నిబద్ధతను మరింత బలోపేతం చేసింది. టాటా మోటార్స్ కమర్షియల్ వెహికల్స్ ట్రక్స్ వైస్ ప్రెసిడెంట్, బిజినెస్ హెడ్ రాజేష్ కౌల్ మాట్లాడుతూ, డ్రైవర్లకు సౌకర్యవంతమైన పని వాతావరణాన్ని అందించడమే కాకుండా, అధిక ఉత్పాదకతను పెంచేందుకు ఎయిర్ కండిషన్డ్ క్యాబిన్లు, కౌల్లను ప్రవేశపెట్టడం కీలకమైన అడుగు అని అన్నారు.