Friday, June 6, 2025
Homeఅంతర్జాతీయంద.కొరియా అధ్యక్షుడిగా లీ జే-మ్యుంగ్‌

ద.కొరియా అధ్యక్షుడిగా లీ జే-మ్యుంగ్‌

. ట్రంప్‌ టారిఫ్‌లతో మన మనుగడకు ముప్పు
. ఉ.కొరియాతో శాంతికి కృషి చేస్తా: జే`మ్యుంగ్‌ హామీ

సియోల్‌: దక్షిణ కొరియా అధ్యక్షుడిగా డెమోక్రటిక్‌ పార్టీ అభ్యర్థి లీ జే-మ్యుంగ్‌ ఎన్నికయ్యారు. దేశ 21వ అధ్యక్షుడిగా ఆయన బుధ వారం నేషనల్‌ అసెంబ్లీ భవనంలో ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం టీవీ మాధ్యమంగా దేశాన్ని ఉద్దేశించి మాట్లాడారు. తన పదవీ కాలం సవాళ్లభరితంగా ఉండబోతోందని, దేశాన్ని అనేక సమస్యలు చుట్టుముట్టి ఉన్నాయని జేమ్యుంగ్‌ అన్నారు. కృత్రిమ మేధ, వాతావరణ మార్పులో పోటీ కూడా పెద్ద సవాల్‌గా ఉందన్నారు. ప్రజల జీవన పరిస్థితులను మెరుగుదలకు, ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణకు తొలి ప్రాధాన్యత ఇస్తానని చెప్పారు. కొత్త వృద్ధి ఇంజిన్‌ల సృష్టికి తమ బంధం కట్టుబడి ఉందన్నారు. ప్రాదేశికాభివృద్ధి, సుస్థిర వృద్ధికి మధ్య సమతుల్యతకు కృషి చేస్తానని చెప్పారు. కొరియా ద్వీపకల్పంలో శాంతి సాధనకు కృషి చేస్తానన్నారు. ఉత్తర కొరియాతో చర్చలు నిర్వహిస్తానని, శాంతి నెలకొల్పేందుకు ప్రయత్నిస్తానని హామీనిచ్చారు. అలాగే, ట్రంప్‌ సుంకాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అమెరికా సుంకాలు దక్షిణ కొరియా మనుగడకు ముప్పు అని అన్నారు. ఉత్తర కొరియాతో శాంతి చర్చలు జరుపుతానని హామీనిచ్చారు. యుద్ధం కంటే శాంతి చవక అని వ్యాఖ్యానించారు. దక్షిణ కొరియా గాయాలు మానేందుకు కృషి చేస్తానని వాగ్దానం చేశారు. దేశ పునరేకీకరణకు లీ జేయ్యుంగ్‌ సంకల్పించారు. ప్రజాస్వామిక వ్యవస్థల పరిరక్షణకు ప్రతిజ్ఞబూనారు. రాజకీయపరమైన విభజలను అంతమొందించే అధ్యక్షుడిని అవుతానని ఉద్ఘాటించారు. అత్యవసర ఆర్థిక టాస్క్‌ఫోర్స్‌ను తక్షణమే క్రియాశీలం చేస్తామని ప్రకటించారు. కాగా, అమెరికాతో వాణిజ్య చర్చలు జరిపేందుకు కొంత సమయం పొందేందుకు దక్షిణ కొరియా కొత్త యంత్రాంగం ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదిలావుంటే, జే-మ్యుంగ్‌కు 51.7 శాతం, కన్జర్వేటివ్‌ పార్టీ అభ్యర్థి కిమ్‌ మూన్‌ సూ ఓటమిని అంగీకరించారు. ఆయనకు 39.3 శాతం ఓట్లు వచ్చాయి. అధ్యక్షుడిగా ఉన్న యూన్‌ సుక్‌ యోల్‌ సైనికపాలన విధించి అభిశంసనకు గురి కావడంతో ముందస్తుగానే ఎన్నికలు జరిగిన విషయం విదితమే. 4,295 పోలింగ్‌ కేంద్రాల్లో పోలింగ్‌ మంగళవారం ఉదయం 6 గంటలకు ప్రారంభమై రాత్రి 8 గంటలకు ముగిసింది. బుధవారం ఫలితాలు వెలువడ్డాయి. మొత్తం 1.9 కోట్ల మంది తమ ఓటు హక్కును వినియోగించుకు న్నారు. ముందస్తు ఓటింగులో మరో 1.5 కోట్ల మంది పాల్గొన్నారు. అధ్యక్షుడిగా ఎన్నికైన జే-మ్యుంగ్‌కు కిమ్‌ మూన్‌ సూ శుభాకాంక్షలు తెలిపారు. ప్రజా తీర్పును అంగీకరిస్తున్నట్లు ప్రకటించారు.
జిన్‌పింగ్‌ శుభాకాంక్షలు
దక్షిణ కొరియా అధ్యక్షుడిగా ఎన్నికైన లీ జే`మ్యుంగ్‌కు చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ శుభాకాంక్షలు తెలిపారు. చైనా, దక్షిణ కొరియా మధ్య సన్నిహిత పొరుగు బంధం, సహకార భాగస్వామ్యం ఉన్నదన్నారు. 33 ఏళ్ల దౌత్య బంధాన్ని తమ రెండు దేశాలు కలిగివున్నాయని, సైద్ధాంతిక, సామాజిక వ్యవస్థల్లో తేడాను అధిగమించి కలిసికట్టుగా ముందుకెళుతూ పరస్పరం విజయాలు సాధిస్తున్నట్లు జిన్‌పింగ్‌ తెలిపారు.
ప్రాదేశిక శాంతి, సుస్థిరత, అభివృద్ధి, సుసంపన్నతకు చైనా, దక్షిణ కొరియా కట్టుబడి ఉన్నాయని, సమ్మిళితంగా అందుకు కృషి చేస్తూ సానుకూల ఫలితాలు సాధిస్తున్నాయని వెల్లడిరచారు. తమ రెండు దేశాల మధ్య బంధం మరింత బలోపేతం కావాలని ఆకాంక్షిస్తున్నట్లు జిన్‌పింగ్‌ పేర్కొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు