Saturday, February 22, 2025
Homeవ్యాపారంనేటి నుంచి ఫ్లిప్‌కార్ట్‌ టాబ్లెట్‌ ప్రీమియర్‌ లీగ్‌ 2025

నేటి నుంచి ఫ్లిప్‌కార్ట్‌ టాబ్లెట్‌ ప్రీమియర్‌ లీగ్‌ 2025

విశాలాంధ్ర/కరీంనగర్‌: భారతదేశంలోని ప్రముఖ ఇ-కామర్స్‌ మార్కెట్‌ప్లేస్‌లలో ఒకటైన ఫ్లిప్‌కార్ట్‌ ఈ సంవత్సరం ఫ్లిప్‌కార్ట్‌ టాబ్లెట్‌ ప్రీమియర్‌ లీగ్‌ 2025 (టిపిఎల్‌ 2025) మొదటి ఎడిషన్‌ను ఫిబ్రవరి 20వ తేదీ మధ్యాహ్నం నుండి ప్రారంభించనుందని ఆ సంస్థ ప్రతినిధి చెప్పారు. టిపిఎల్‌ 2025, సరసత లభ్యత  పట్ల ఫ్లిప్‌కార్ట్‌ నిబద్ధతను కొనసాగిస్తుందని అదే సమయంలో ప్రయాణంలో వినోదం కోసం పెరుగుతున్న డిమాండ్‌ను తీరుస్తుందన్నారు. ఈ ఎడిషన్‌ అగ్రశ్రేణి టాబ్లెట్‌లపై పరిశ్రమ ప్రముఖ డీల్‌లను అందిస్తుందని, దీని వలన వినియోగదారులు తమ బడ్జెట్‌ను పెంచకుండా వారి పరికరాలను అప్‌గ్రేడ్‌ చేసుకోవచ్చు అన్నారు. ‘స్క్రీన్‌ బడా, సీన్‌ బడా’ అనే నేపథ్యంతో, వినోదం, విద్య, ఉత్పాదకత టాబ్లెట్‌ అమ్మకాలకు కీలకమైన డ్రైవర్లు అని టిపిఎల్‌ 2025 హైలైట్‌ చేస్తుందని, ఓటిటి స్పోర్ట్స్‌ స్ట్రీమింగ్‌ వినియోగాన్ని పెంచడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు