Monday, June 9, 2025
Homeతెలంగాణన్యాయం గెలిచింది : కూనంనేని

న్యాయం గెలిచింది : కూనంనేని

విశాలాంధ్ర- హైదరాబాద్‌: తన ఎన్నిక చెల్లదంటూ వేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేయడంతో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు హర్షం వ్యక్తం చేశారు. గతంలో ప్రజాక్షేత్రంలో గెలుపొందడం ద్వారా ప్రజా విజయం సాధించామని, తాజాగా అసంబద్ధమైన అంశాలతో వేసిన కేసును హైకోర్టు కొట్టివేయడం ద్వారా న్యాయం గెలిచిందని ఆయన వ్యాఖ్యానించారు. హైకోర్టు తీర్పుపై సోమవారం తనను కలిసిన మీడియా ప్రతినిధులతో కూనంనేని స్పందించారు. ఈ తీర్పుతో న్యాయ వ్యవస్థపై మరింత విశ్వాసం, గౌరవం ప్రజల్లో పెరిగిందని అన్నారు. లక్షలాది మంది ఓట్లు వేసి గెలిపించినటువంటి వారి మనోభావాలకు భిన్నంగా అడ్డదారుల్లో ప్రయోజనం పొందాలనుకునేవారికి ఈ తీర్పు చక్కని గుణపాఠం అని అన్నారు. అందుకు న్యాయవ్యవస్థకు ధన్యవాదాలు తెలియజేస్తున్నానని పేర్కొన్నారు. ఈ తీర్పు ద్వారా ప్రజా సేవలో ద్విగుణీకృతమైన ఉత్సహంతో పనిచేసేందుకు మరింత స్పూర్తిని కలిగించిందని సాంబశివరావు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు