Tuesday, June 17, 2025
Homeఅంతర్జాతీయంపశ్చిమాసియాలో ఎయిర్‌పోర్ట్‌ల మూసివేత

పశ్చిమాసియాలో ఎయిర్‌పోర్ట్‌ల మూసివేత

చిక్కుకుపోయిన వేలాది మంది ప్రయాణికులు
టెల్‌అవివ్‌ : ఇజ్రాయిల్‌`ఇరాన్‌ మధ్య ఉద్రిక్తతలు తారా స్థాయికి చేరిన నేపథ్యంలో పశ్చిమాసియా దేశాల కీలక నిర్ణయం తీసుకున్నాయి. ఇజ్రాయిల్‌ దళాలు పెద్ద ఎత్తున క్షిపణి దాడులకు పాల్పడుతుండటంతో.. తమ గగనతలాన్ని అనేక దేశాలు మూసివేశాయి. ఇజ్రాయిల్‌ దాడులతో ఇరాన్‌ తన గగనతలాన్ని పూర్తిగా మూసివేసిన విషయం తెలిసిందే. తాజాగా లెబనాన్‌, జోర్దాన్‌, ఇరాక్‌ దేశాలు కూడా విమానాల రాకపోకలను నిలిపివేశాయి ఈ చర్యతో పశ్చిమాసియా వ్యాప్తంగా విమానాశ్రయాలు మూతపడ్డాయి. దీంతో వేలాది మంది ప్రయాణికులు అక్కడ చిక్కుకుపోయారు. దాదాపు 10 వేల మందికిపైగా ప్రజలు పశ్చిమాసియా దేశాల్లో చిక్కుకుపోయినట్లు అంతర్జాతీయ మీడియా వెల్లడిరచింది. మరోవైపు ఇజ్రాయిల్‌ సైతం తమ దేశంలోని అత్యంత కీలకమైన బెన్‌ గురియన్‌ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని మూసివేసింది. తదుపరి ప్రకటన వచ్చే వరకూ ఆంక్షలు కొనసాగుతాయని తెలిపింది. దీంతో దాదాపు 50 వేల మందికిపైగా ఇజ్రాయెల్‌ ప్రయాణికులు విదేశాల్లో చిక్కుకున్నారు. మరోవైపు ఇరాన్‌ దాడులు కొనసాగుతుండటంతో దేశంలోని మూడు విమానయాన సంస్థలకు చెందిన జెట్‌ విమానాలను లార్నాకాకు తరలించారు. ఇజ్రాయిల్‌ పౌరులు జోర్డాన్‌, ఈజిప్ట్‌లతో ఉన్న సరిహద్దుల ద్వారా దేశం విడిచి వెళ్లవద్దని, ఆ ప్రాంతాల్లో ప్రమాదం పొంచి ఉందని ప్రధాని నెతన్యాహు హెచ్చరికలు జారీ చేశారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు