Saturday, June 21, 2025
Homeఅంతర్జాతీయంప్చ్‌! నాకు నోబెల్‌ రాదేమో: ట్రంప్‌

ప్చ్‌! నాకు నోబెల్‌ రాదేమో: ట్రంప్‌

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌కు నోబెల్‌ శాంతి పురస్కారం ప్రదానం చేయాలన్న పాకిస్థాన్‌ ప్రతిపాదన పెద్దఎత్తున చర్చకు దారితీసింది. ఈ నేపథ్యంలో ట్రంప్‌ స్పందిస్తూ తనకు శాంతి పురస్కారం రాదేమో అని వ్యాఖ్యానించారు. ట్రంప్‌నకు నోబెల్‌ శాంతి బహుమతి`2026ను ఇవ్వాలని పాకిస్థాన్‌ ప్రభుత్వం ప్రతిపాదించింది. భారత్‌-పాక్‌ ఉద్రిక్తతల వేళ దౌత్యపరంగా కాల్పుల విరమణకు ట్రంప్‌ కృషి చేశారని, అందుకు ఆయనను ఈ ప్రతిష్ఠాత్మక పురస్కారంతో సన్మానించడం సబబుగా ఉంటుందని పేర్కొంది. అయితే కాల్పుల విరమణలో ట్రంప్‌ జోక్యాన్ని భారత్‌ ఖండిరచారు. ట్రంప్‌ మాత్రమే ఇవేమీ పట్టించుకోకుండా భారత్‌-పాక్‌ మధ్య యుద్ధాన్ని ఆపినప్పటికీ తనకు నోబెల్‌ బహుమతి రాదేమో అన్నారు. లిబరల్స్‌కు మాత్రమే ఈ పురస్కారాన్ని అందిస్తారని వ్యాఖ్యానించారు. భారత్‌-పాకిస్థాన్‌ వ్యవహారాలతో పాటు కాంగో-రువాండా దేశాల మధ్య శాంతి ఒప్పందానికి ఎంతో కృషి చేసినట్లు చెప్పుకున్నారు. ‘నాకు నాలుగు, ఐదు సార్లు నోబెల్‌ బహుమతి రావాలి. కానీ లిబరల్స్‌కు మాత్రమే ఆ పురస్కారం ఇస్తారు’ అని నోబెల్‌ కమిటీపై విమర్శలు గుప్పించారు. తాన జోక్యం వల్లే అణు యుద్ధం తప్పిందని మరోసారి చెప్పుకున్నారు. అయితే ట్రంప్‌కు నోబెల్‌ ఇవ్వాలన్న పాక్‌ ప్రతిపాదనపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కొందరు మెచ్చుకుంటే, మరికొందరు విమర్శించారు. రాజకీయ లబ్ధి కోసమేనంటూ తప్పుపట్టారు. పాకిస్థాన్‌ సైన్యాధికారి అజామ్‌ మునీర్‌ అమెరికా పర్యటన నేపథ్యంలో ‘నోబెల్‌’ ప్రతిపాదన వచ్చింది.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు