Friday, June 6, 2025
Homeప్రజా విశ్వాసం కోల్పోతాం

ప్రజా విశ్వాసం కోల్పోతాం

జడ్జీల అవినీతి, దుష్ప్రవర్తనపై సీజేఐ గవాయ్‌

న్యూదిల్లీ : న్యాయవ్యవస్థలో అవినీతి, దుష్ప్రవర్తన ఘటనలు ప్రజల్లో విశ్వాసాన్ని దెబ్బతీస్తాయని భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) బీఆర్‌ గవాయ్‌ పేర్కొన్నారు. మొత్తం న్యాయవ్యవస్థ సమగ్రతపై విశ్వాసం క్షీణింపచేసే అవకాశం ఉందని హెచ్చరించారు. సుప్రీంకోర్టులో ‘న్యాయ చట్టబద్ధత` ప్రజా విశ్వాసాన్ని కాపాడుకోవడం’ అనే అంశంపై బుధవారం జరిగిన రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో ఆయన మాట్లాడారు. పదవీవిరమణ తర్వాత జడ్జీలు తీసుకునే బాధ్యతల గురించి స్పందిస్తూ… ఒక జడ్జి పదవీ విరమణ చేసిన వెంటనే ప్రభుత్వ నియామకాన్ని చేపడితే లేదా ఎన్నికల్లో పోటీ చేయడానికి ధర్మాసనానికి రాజీనామా చేస్తే అది ముఖ్యమైన నైతిక ఆందోళనలను లేవనెత్తుతుందని, ప్రజల పరిశీలనకు దారితీస్తుందని సీజేఐ గవాయ్‌ చెప్పారు. ప్రతి వ్యవస్థ ఎంత ధృడంగా ఉన్నా… చెడు ప్రవర్తనలు సమస్యలకు దారి తీస్తాయన్నారు. విచారకరమైన విషయం ఏమిటంటే న్యాయవ్యవస్థలో కూడా అవినీతి, చెడు ప్రవర్తనకు సంబంధించిన అంశాలు వెలుగులోకి వచ్చాయని, ఇటువంటి సంఘటనలు అనివార్యంగా ప్రజల విశ్వాసంపై ప్రతికూల ప్రభావం చూపుతాయని, మొత్తం న్యాయ వ్యవస్థ సమగ్రతపై విశ్వాసాన్ని దెబ్బతీసే అవకాశం ఉందని ఆయన అన్నారు. విశ్వాసాన్ని పునర్మించడానికి సుప్రీంకోర్టు అవినీతి, చెడు ప్రవర్తనను పరిష్కరించేందుకు తక్షణ, తగిన చర్యలు తీసుకుంటుందని ఆయన వెల్లడిరచారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు