. తగ్గిన సంతానోత్పత్తి రేటు
. గణనీయ స్థాయిలోనే యువశక్తి
. యూఎన్ఎఫ్పీఏ నివేదిక వెల్లడి
న్యూదిల్లీ : ప్రపంచంలోనే అత్యధిక జనాభాగల దేశంగా భారత్ నిలిచింది. దేశ జనాభా 146 కోట్లకు చేరువైంది. మరోవైపు సంతానోత్పత్తి క్షీణించింది. అది భర్తీ రేటు (రీప్లేస్మెంట్ రేట్) కంటే కూడా తగ్గిపోయింది. ఈ మేరకు ఐరాస నివేదిక పేర్కొంది. సంతానోత్పత్తి తగ్గడం వల్ల కలిగే భయాందోళనల నుంచి నెరవేరని సంతానోత్పత్తి లక్ష్యాల వైపునకు దృష్టి మళ్లించాలని ‘ది రియల్ ఫెర్టిలిటీ క్రైసిస్’ పేరిట యూఎన్ఎఫ్పీఏ 2025 స్టేట్ ఆఫ్ వరల్డ్ పాపులేషన్ (ఎస్ఓడబ్ల్యూపీ) నివేదిక పిలుపునిచ్చింది. సంతానోత్పత్తి లక్ష్యాలను లక్షలాది మంది గ్రహించలేకపోతున్నారని పేర్కొంది. జనాభా కూర్పు, సంతానోత్పత్తి, ఆయుర్దాయంలో కీలక మార్పులను వెల్లడిరచింది. జనాభా పరివర్తనను సూచించింది. సంతానోత్పత్తి రేటు ప్రతి మహిళకు 2.1 నుంచి 1.9 జననాలకు తగ్గినట్లు పేర్కొంది. ఒక తరం నుంచి మరొక తరానికి మధ్య జనాభా పరిణామానికి అవసరమైన దాని కంటే తక్కువ మంది పిల్లలకు భారతీయ మహిళలు జన్మనిస్తున్నట్లు నివేదిక వెల్లడిరచింది. జనానాలు తగ్గినప్పటికీ దేశ యువశక్తి గణనీయంగానే ఉందని పేర్కొంది. 014 ఏళ్ల వారు 24 శాతం మంది ఉంటే, 10
19 ఏళ్ల వారు 17 శాతం మంది, 1024 ఏళ్ల వారు 26 శాతం మంది ఉన్నట్లు తెలిపింది. అలాగే పని చేసే వయస్సు అంటే 15
64 మధ్య వయస్కులు 68 శాతం మంది ఉన్నట్లు తెలిపింది. వృద్ధులు (65ఏళ్లు పైబడిన వారు) ఏడు శాతంగా ఉన్నారని, రాబోయే కాలంలో ఈ సంఖ్య పెరుగుతుందన్నది అంచనా. 2025లో ఆయుర్దాయం అంచనా పురుషులకు 71 ఏళ్లు, మహిళలకు 74 ఏళ్లుగా ఉంది. దేశ జనాభా ప్రస్తుతం 1,463.9 మిలియన్లు అంటే 146.39 కోట్లుగా ఉందని ఐక్యరాజ్య సమితి అంచనా వేసింది. దాదాపు 40 ఏళ్ల తర్వాత జనాభా క్షీణత మొదలవుతుందన్న అంచనా ఉండగా… ఆలోగా దేశ జనాభా 1.7 బిలియన్ అంటే 170 కోట్లకు పెరిగుతుందని నివేదిక పేర్కొంది. 1960లో జనాభా 436 మిలియన్ అంటే 43.6 కోట్లు కాగా అప్పట్లో ఒక్కో మహిళకు సగటున ఆరుగురు సంతానం ఉండేవారు. ప్రతి నలుగురిలో ఒకరు మాత్రమే గర్భనిరోధక విధానాలు అనుసరించేవారు. ఇద్దరిలో ఒకరు మాత్రమే ప్రాథమిక విద్యను పొందేవారు (ప్రపంచ బ్యాంకు డాటా 2020 ఆధారంగా) అని నివేదిక వెల్లడిరచింది. ఆపై దశాబ్దాల్లో మహిళలు విద్యావంతులు కావడంతో మార్పు వచ్చిందని, ప్రస్తుతం ఇద్దరు పిల్లలకు మించి సంతానం ఉండటం లేదని నివేదిక పేర్కొంది. జనాభా పరివర్తనం దృష్ట్యా భారత్ను మధ్య-ఆదాయ దేశంగా ఐరాస గుర్తించింది.
జనాభా రెట్టింపయ్యే కాలాన్ని 79 ఏళ్లుగా అంచనా వేసింది. 1970 నాటి పరిస్థితులతో పోల్చితే మహిళలకు తమ ఆరోగ్యం, గర్బధారణపై అవగాహన పెరిగింది. ఫలితంగా సంతానోత్పత్తి నిష్పత్తి మెరుగైందని యూఎన్ఎఫ్పీఏ భారత్ ప్రతినిధి ఆండ్రియా ఎం వోజ్నార్ అన్నారు. ప్రసూతి మరణాలు తగ్గాయన్నారు. తల్లుతు తమ పిల్లలకు మాతృత్వాన్ని పంచగలుగుతున్నారన్నారు. గర్భదారణపై సంపూర్ణ స్వేచ్ఛ ఉన్నప్పుడే నిజమైన ప్రయోజనం ఉంటుందని… సంతానోత్పత్తి హక్కులు`ఆర్థిక సౌభాగ్యం ఏ విధంగా కలిసి ముందుకు సాగగలవో చూపే అవకాశం భారత్కు ఉన్నదని ఆండ్రియా నొక్కిచెప్పారు.