Friday, February 21, 2025
Homeవ్యాపారంమహా కుంభమేళాలో ఎయిర్‌టెల్‌ పేమెంట్స్‌ బ్యాంక్‌ డిజిటల్‌ బ్యాంకింగ్‌ సేవలు

మహా కుంభమేళాలో ఎయిర్‌టెల్‌ పేమెంట్స్‌ బ్యాంక్‌ డిజిటల్‌ బ్యాంకింగ్‌ సేవలు

ముంబయి: కార్పొరేట్‌ సామాజిక బాధ్యత (సీఎస్‌ఆర్‌)లో భాగంగా ఎయిర్‌టెల్‌ పేమెంట్స్‌ బ్యాంక్‌ మహా కుంభమేళాలో భక్తులు, వ్యాపారులకు సురక్షితమైన డిజిటల్‌ బ్యాంకింగ్‌ సేవలు అందిస్తోంది.లక్షలాది మంది భక్తులకు బ్యాంక్‌ ఆర్థిక సేవలను సులభంగా పొందేలా చేస్తూ, సురక్షితమైన లావాదేవీలను నిర్ధారిస్తోంది. ఇక్కడ కార్యక్రమాలన్నీ సజావుగా నిర్వహించేందుకు సహకారాన్ని అందిస్తోంది. ఎయిర్‌టెల్‌ పేమెంట్స్‌ బ్యాంక్‌ విశాలమైన మేళా మైదానంలో పది వ్యూహాత్మక ప్రదేశాల్లో ఉన్న కియోస్క్‌లను ఏర్పాటు చేసింది. ఈ కియోస్క్‌లు అవసరమైన బ్యాంకింగ్‌ సేవలను అందిస్తుండగా, భక్తులు తమ ఖాతాల నుంచి నగదు డ్రా చేసుకునేందుకు లేదా ఏదైనా బ్యాంకు ఖాతాకు నిధులను బదిలీ చేసేందుకు అవకాశం కల్పిస్తాయి. ఆధార్‌-లింక్‌ అయిన బ్యాంక్‌ ఖాతా ఉన్న ఏ బ్యాంకు వినియోగదారుడు అయినా ఈ సేవల ప్రయోజనాన్ని పొందవచ్చు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు