న్యూదిల్లీ: భారతదేశంలోని అతిపెద్ద ఆధ్యాత్మిక సమావేశాలలో ఒకటి మహా కుంభ్ 2025లో కోకా-కోలా ఇండియా తమ ‘మైదాన్ సాఫ్’ ప్రచారంతో ప్రవర్తనా పూర్వక మార్పును నడిపించడంలో, శాశ్వత విలువను సృష్టించడంలో ముందుంది. పర్యావరణ అనుకూల ఆవిష్కరణలు చేపట్టింది. మహా కుంభ్ పండుగలో ప్రభావం చూపే ఐదు ప్రయత్నాలను చేపట్టింది. 1. రీసైకిల్ చేసిన పెట్ జాకెట్లతో వ్యర్థ పదార్థాల సేకరణ కార్మికులకు తగిన శక్తిని అందించటం, 2. బోట్మెన్లకు లైఫ్ జాకెట్లు – పర్యావరణ పరిరక్షణతో కూడిన భద్రతను అందించడం, 3. మహిళల కోసం రీసైకిల్ చేయబడిన ప్లాస్టిక్తో వస్త్రాలు మార్చుకునే గదులు ఏర్పాటు చేయడం, 4. అవగాహన కోసం కళ-చిత్రాల ద్వారా మార్పును ప్రేరేపించడం, 5. బాధ్యతాయుతమైన వ్యర్థాల తొలగింపు, ఆర్థిక అవకాశాన్ని ప్రోత్సహించే హైడ్రేషన్ కార్ట్లు ఏర్పాటు చేయడం వంటి కార్యక్రమాలు చేపట్టింది.