మాస్కో/కీవ్: రష్యా, ఉక్రెయిన్ మధ్య శాంతి చర్చలు కొలిక్కి రాలేదు. ఏకాభిప్రాయం కుదరకుండానే టర్కీలోని ఇస్తాంబుల్లో నిర్వహించిన చర్చలు అసంబద్ధంగా ముగిశాయి. కాల్పుల విరమణపై జరిగిన చర్చలు ఫలించినట్లు ఏ దేశం ప్రకటించలేదు. మరోవైపు రష్యా, ఉక్రెయిన్ పరస్పరం పోరు కొనసాగిస్తుండటంతో 24 గంటల్లో 1,430 మంది ఉక్రెయిన్ సైనికులను మట్టుబెట్టినట్టు రష్యా రక్షణ శాఖ ప్రకటించింది. ఉక్రెయిన్ రాజధాని కీవ్లో డ్రోన్లు, క్షిపణులు, ఫిరంగులను ధ్వంసం చేసినట్లు తెలిపింది. మూడేళ్లుగా కొనసాగుతున్న యుద్ధంలో 10లక్షల మందికిపైగా రష్యా సైనికులు మరణించినట్లు ఉక్రెయిన్ వెల్లడిరచింది. ‘ఇప్పటివరకు మొత్తం 9,90,800 మంది రష్యా సైనికులు మరణించారు. అందులో 1,100 మంది సైనికులు గత 24 గంటల్లో ప్రాణాలు కోల్పోయారు’ అని ఉక్రెయిన్ సాయుధ దళాల జనరల్ స్టాఫ్ ఆఫీస్ పేర్కొంది. 10,881 ట్యాంకులు, 22,671 సాయుధ పోరాట వాహనాలు, 50,607 ఇంధన ట్యాంకులు, 28,623 ఫిరంగి వ్యవస్థలు, 1,402 బహుళ ప్రయోగ రాకెట్ వ్యవస్థలు, 1,176 వైమానిక రక్షణ వ్యవస్థలు, 384 విమానాలు, 41 యుద్ధ విమానాలు, 336 హెలికాప్టర్లు, 38,748 డ్రోన్లు, 28 నౌకలు, ఒక జలాంతర్గామిని రష్యా కోల్పోయిందని వెల్లడిరచింది.