అహ్మదాబాద్లో కుప్పకూలిన ఎయిరిండియా విమానం
సిబ్బంది సహా 241 మంది ప్రయాణికుల దుర్మరణం
. 204 మృతదేహాల వెలికితీత
. మృతుల్లో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ
. మెడికల్ హాస్టల్ ధ్వంసం… 20 మంది వైద్య విద్యార్థుల మృత్యువాత?
అహ్మదాబాద్ : విమానయాన చరిత్రలో మరో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. గుజరాత్ నగరం అహ్మదాబాద్ నుంచి లండన్ బయల్దేరిన ఎయిరిండియా విమానం టేకాఫ్ అయిన నిమిషాల్లోనే కుప్పకూలింది. సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి గురువారం మధ్యాహ్నం 1.39 గంటలకు లండన్ బయల్దేరిన ఎయిరిండియా ఫ్లయిట్ నెంబర్ ఏఐ-171… టేకాఫ్ అయిన వెంటనే సమీపంలోని జనావాసాలపై కూలి…పేలిపోయింది. అందులో ని ప్రయాణికులు, సిబ్బంది మొత్తం 241 మంది దుర్మరణం చెందినట్లు భావిస్తున్నారు. ప్రమాద శిథిలాల నుంచి 204 మృతదేహాలు స్వాధీనం చేసుకున్నారు. మృతుల్లో 168 మంది భారతీయులు కాగా, మరో 53 మంది బ్రిటన్ పౌరులు, ఏడుగురు పోర్చుగీస్ జాతీయులతో పాటు ఒక కెనడా పౌరుడు ఉన్నారు. కాగా విమాన ప్రమాదం నుంచి ఓ వ్యక్తి ప్రాణాలతో బయటపడినట్టు అహ్మదాబాద్ సీపీ జీఎస్ మాలిక్ తెలిపారు. 11ఏ నెంబర్ సీట్లోని ప్రయాణికుడు రమేశ్ బిశ్వాస్ సజీవంగా బయటపడినట్లు చెప్పారు. అతడికి ఆస్పత్రిలో చికిత్సనందిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇదిలా ఉండగా ప్రమాదానికి గురైన ఎయిర్ ఇండియా విమానం జనావాసాల్లో పడటంతో దీనిలోని కొన్ని భాగాలు అక్కడే ఉన్న బీజే మెడికల్ కాలేజీ యూజీ హస్టల్ భవనాలపై పడ్డాయి. దీంతో భారీ ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ దుర్ఘటనలో 20మందికి పైగా విద్యార్థులు మృతిచెందినట్లు వార్తలొచ్చాయి. కాగా ఐదుగురు విద్యార్థులు చనిపోయినట్లు హాస్టల్ నిర్వాహకులు తెలిపారు. ఇంకా అనేకమంది విద్యార్థులు తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. మృతి చెందిన వారిలో నలుగురు అండర్ ఎంబీబీఎస్, ఒక పీజీ విద్యార్థి ఉన్నారు. ప్రమాదం జరిగిన నిమిషాల్లో సహాయక సిబ్బంది అక్కడికి చేరుకోవడంతో అనేకమందిని సురక్షితంగా బయటకు తీశారు. విద్యార్థుల భోజనాలు చేస్తున్నప్పుడు ఈ ఘటన చోటు చేసుకోవడంతో మెస్లో ప్లేట్లు, ఆహారం చిందరవందరగా పడిన దృశ్యాలు వైరల్గా మరాయి. సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి. ప్రమాదస్థలి నుంచి అహ్మదాబాద్ సివిల్ ఆస్పత్రి వరకు గ్రీన్కారిడార్ను ఏర్పాటు చేశారు.
ప్రమాదానికి నిర్దిష్ట కారణాలు తెలియాల్సి ఉంది. కాగా ప్రమాదం జరిగిన వెంటనే విమానం నుంచి దట్టమైన నల్లటి పొగలు ఆకాశాన్ని కమ్మేశాయి. సుదూర ప్రయాణానికి సరిపడా ఇంధనం నిండుగా ఉండటంతో విమానం నేలకూలిన వెంటనే భారీగా మంటలు చెలరేగాయని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.
ఓ ప్రత్యక్షసాక్షి కథనం ప్రకారం.. ‘‘నేను ఇంట్లో ఉన్న సమయంలో భారీ శబ్దం వినిపించింది. ఏం జరిగిందో అని చూసేందుకు బయటకు వెళ్లగా ఆకాశంలో దట్టమైన పొగ కనిపించింది. అక్కడికి వెళ్లి చూడగా.. కూలిపోయిన విమాన శకలాలతోపాటు అనేక మృతదేహాలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి’’ అని వెల్లడిరచాడు. ప్రమాదానికి గురైన విమానంలో ఇద్దరు పైలట్లు, పది మంది సిబ్బంది సహా మొత్తం 242 మంది ఉన్నట్లు ఎయిరిండియా వెల్లడిరచింది. ఈ ఘటనలో చాలా మంది చనిపోయినట్లు విదేశాంగశాఖ వెల్లడిరచినప్పటికీ.. మృతుల సంఖ్యపై స్పష్టత ఇవ్వలేదు. అయితే, అందులో కొందరు ప్రాణాలతో బయటపడే అవకాశం లేకపోలేదని అహ్మదాబాద్ పోలీస్ కమిషనర్ వెల్లడిరచారు. ఇప్పటివరకు గుర్తించిన మృతదేహాలను పోస్టుమార్టం కోసం పంపించామన్నారు.
అత్యవసర సేవలకు ఎలాంటి అంతరాయం కలుగకుండా సంఘటన జరిగిన పరిసరాలను అధికారులు అధీనంలోకి తీసుకున్నారు. ట్రాఫిక్ మళ్లింపు చర్యలు చేపట్టారు. పదుల సంఖ్యలో అంబులెన్స్లను అందుబాటులో ఉంచారు.
అ విమానాశ్రయం రన్వే నుంచి టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ప్రమాదానికి గురైంది. మేఘాని నగర్ ఘోడాసర్ క్యాంప్ ప్రాంతంలో విమానం ఒక్కసారిగా కూలిపోయి భారీ శబ్దంతో విస్ఫోటనం చెందింది. సెకన్ల వ్యవధిలోనే విమానం దాదాపుగా కాలిబూడిదైంది. దీంతో ఆ ప్రదేశమంతా దట్టమైన నల్లటిపొగ అన్ని వైపులకు వ్యాపించింది. ఫ్లైట్ రాడార్ 24 ప్రకారం విమానం 625 అడుగుల ఎత్తులో ఉండగా సిగ్నల్స్ కోల్పోయింది. ఈ క్రమంలో మధ్యాహ్నం 1.39 సమయంలో పూర్తిగా కిందకు దిగిపోయి చెట్టును ఢీకొన్నట్లు ప్రాథమికంగా భావిస్తున్నారు.
అ ప్రమాదానికి గురైన విమానం వైడ్బాడీ బోయింగ్ 787 డ్రీమ్ లైనర్. దీనిలో 300 మంది ప్రయాణించవచ్చు. ఇది 11 ఏళ్లుగా సేవలు అందిస్తోంది. సుదూర ప్రయాణం కావడంతో విమానంలో ఇంధనం కూడా భారీ ఉండటంతో.. ప్రమాద తీవ్రత మరింత పెరిగింది. విమాన కూలిన విషయం తెలియగానే అగ్నిమాపక శకటాలు ఆ ప్రాంతానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టాయి.
డీజీసీఏ స్పందన…
ఈ ప్రమాదంపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) స్పందించింది. విమానానికి కెప్టెన్గా ఉన్న సుమిత్ సబర్వాల్, ఫస్ట్ ఆఫీసర్గా క్లైవ్ కుండర్ వ్యవహరించినట్లు పేర్కొంది. సుమిత్కు ఎల్టీసీగా 8,200 గంటలు, కోపైలట్కు 1,100 గంటల అనుభవం ఉన్నట్లు వెల్లడిరచింది. ఏటీసీ నుంచి వచ్చిన సమాచారం మేరకు ఈ విమానం రన్వే 23 నుంచి గాల్లోకి ఎగిరినట్లు తెలిపింది. కొద్ది సేపటికే ఆ విమానం నుంచి ఏటీసీకి మేడేకాల్ (అత్యవసర కాల్) వచ్చిందని వెల్లడిరచింది. ఆ తర్వాత కూలిపోయినట్లు పేర్కొంది. మరోవైపు ఎయిరిండియా కూడా ఎక్స్ వేదికగా ప్రమాదాన్ని ధ్రువీకరించింది. విమానంలో 169 మంది భారతీయులు, 53 మంది బ్రిటన్, ఏడుగురు పోర్చుగీస్ జాతీయులతో పాటు ఒక కెనడా వాసి ఉన్నట్లు వెల్లడిరచింది. ఈ ప్రమాదంపై సమాచారం కోసం హాట్లైన్ నెంబర్ 1800 5691 444 ఏర్పాటు చేసినట్లు తెలిపింది. తమ సామాజిక మాధ్యమం, ఎయిరిండియా వెబ్సైట్లో కూడా ప్రమాద వివరాలు, అప్డేట్లు ఉంటాయని పేర్కొంది. ప్రమాదం జరిగిన వెంటనే తదుపరి ప్రకటన వెలువడే వరకు అహ్మదాబాద్ ఎయిర్పోర్టులో ఫ్లైట్ ఆపరేషన్స్ను సస్పెండ్ చేశారు.
మృతుల కుటుంబాలకు టాటా గ్రూప్
కోటి పరిహారం
అహ్మదాబాద్ విమాన ప్రమాద ఘటనపై ఎయిరిండియా యాజమాన్యం టాటా గ్రూప్ స్పందించింది. మృతుల కుటుంబాలకు రూ.కోటి చొప్పున పరిహారం ప్రకటించింది. గాయపడిన వారి వైద్య ఖర్చులను కూడా తామే భరిస్తామని, వారి సంరక్షణ బాధ్యత కూడా దమదేనని తెలిపింది. ఈ మేరకు టాటా సన్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ ఓ ప్రకటన విడుదల చేశారు. ‘ఎయిరిండియా ప్రమాద ఘటన మమ్మల్ని తీవ్రంగా కలచివేసింది. ఆ బాధను వ్యక్తపరచడానికి మాటలు కూడా రావడం లేదు. ప్రమాదంలో ప్రియమైన వారిని కోల్పోయిన కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం. బీజే మెడికల్ హాస్టల్ నిర్మాణానికి మా వంతుగా తోడ్పాటు అందిస్తాం’ అని చంద్రశేఖరన్ పేర్కొన్నారు. ఈ ఘటనపై ఎయిరిండియా ఎండీ, సీఈఓ క్యాంప్బెల్ విల్సన్ తీవ్ర విచారం వ్యక్తంచేశారు.