Sunday, April 20, 2025
Homeవ్యాపారంరక్త మూల కణ దానంపై డీకేఎంఎస్‌ ఇండియా, ఐఐటీ హైదరాబాద్‌ భాగస్వామ్యం

రక్త మూల కణ దానంపై డీకేఎంఎస్‌ ఇండియా, ఐఐటీ హైదరాబాద్‌ భాగస్వామ్యం

విశాలాంధ్ర/హైదరాబాద్‌: రక్త క్యాన్సర్‌, రక్త రుగ్మతలపై పోరాటానికి అంకితమైన లాభాపేక్షలేని సంస్థ అయిన డీకేఎంఎస్‌ ఫౌండేషన్‌ ఇండియా, ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ హైదరాబాద్‌ (ఐఐటీ హైదరాబాద్‌)తో కలిసి రక్త మూల కణ అవగాహన, దాన కార్యక్రమాన్ని ఐఐటీ హైదరాబాద్‌ కళాశాల ఉత్సవం ఎలాన్‌ అండ్‌ ఎన్విజన్‌ 2025 సందర్భంగా విజయవంతంగా నిర్వహించింది. 16వ వార్షిక సాంకేతిక-సాంస్కృతిక ఉత్సవంలో డీకేఎంఎస్‌ ఫౌండేషన్‌ ఇండియా సామాజిక సంక్షేమ భాగస్వామిగా ఉంది. రక్త క్యాన్సర్‌లు, ఇతర ప్రాణాంతక రక్త సంబంధిత రుగ్మతలను ఎదుర్కోవడానికి భారతదేశంలో బలమైన రక్త మూల కణ దాత రిజిస్ట్రీని కలిగి ఉండవలసిన అవసరం గురించి యువతకు అవగాహన కల్పించడానికి డీకేఎంఎస్‌ ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంది. ఈ కార్యక్రమంలో 350 మందికి పైగా విద్యార్థులు సంభావ్య రక్త మూల కణ దాతలుగా నమోదు చేసుకోవడానికి ముందుకు వచ్చారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు