. 5 వేల మందికి ఉపాధి
. యూఏఈ కంపెనీలతో ఎంఓయూ
. మంత్రి శ్రీధర్బాబు వెల్లడి
విశాలాంధ్ర-హైదరాబాద్ : రాష్ట్రంలో యూఏఈకి చెందిన ప్రముఖ సంస్థలు శైవ గ్రూప్, టారనిస్ కేపిటల్ సంయుక్తంగా రూ.2125 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చి నట్లు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు వెల్లడిరచారు. దీనికి సంబంధించి రాష్ట్రానికి చెందిన ఐదు కంపెనీలతో మంగళవారం సచివాల యంలో అవగాహన ఒప్పందం చేసుకున్నాయన్నాయన్నారు. తద్వారా కొత్తగా మరో 5020 మంది తెలంగాణ యువతకు ఉపాధి లభిస్తుందని వివరిం చారు. ఈ సందర్భంగా సచివాలయంలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. మంత్రి శ్రీధర్బాబు మాట్లాడుతూ… ‘రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొచ్చి… తెలంగాణ యువతకు ఉద్యోగాలు కల్పించాలన్నదే సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం సంకల్పం’ అన్నారు. 18 నెలల్లో 60వేలకు పైగా ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేశాం. ఏడాదిన్నర కాలంలో రూ.3 లక్షల కోట్ల పెట్టుబడులను తెలంగాణకు తీసుకొచ్చాం. ఫలితంగా ప్రైవేట్ రంగంలో లక్ష మందికి పైగా తెలంగాణ యువతకు ఉద్యోగాలు లభించాయి. ఈ ప్రయాణంలో ఈరోజు మరో గొప్ప అడుగు ముందుకేశా మని తెలిపారు. తెలంగాణ పురోగతిలో భాగస్వామయ్యేందుకు ముందుకొచ్చిన శైవ గ్రూప్, టారనిస్ కేపిటల్ను ప్రభుత్వం తరఫున సాదరంగా ఆహ్వానిస్తున్నామని చెప్పారు. ఈ రెండు సంస్థలు సంయుక్తంగా రివలేషన్స్ బయోటెక్లో రూ.1360 కోట్లు, మనాకిన్ బయోలో రూ.340 కోట్లు, స్వబోధ ఇన్ఫినిటీ ఇన్వెస్ట్ మెంట్స్ అడ్వైజర్స్ లో రూ.80 కోట్లు, ఎగ్జిగెంట్ డ్రిల్లింగ్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ రూ.90 కోట్లు, యంత్ర టెక్ కంట్రోల్స్ లో రూ.255 కోట్లు పెట్టుబడులు పెడుతున్నాయని చెప్పారు. ‘ఇది తొలి అడుగు మాత్రమే. రాబోయే మూడేళ్లలో బయోటెక్, ఏఐ, డేటా సెంటర్, డిఫెన్స్, ఎనర్జీ, ఫిన్ టెక్, పబ్లిక్ సెక్టార్స్ తదితర రంగాల్లో లో మరో రూ.24వేల కోట్లు పెట్టుబడి పెట్టేందుకు శైవ గ్రూప్, టారనిస్ కేపిటల్ సంసిద్ధత వ్యక్తం చేశాయి’ అంటూ హర్షం వ్యక్తం చేశారు. కొందరు రాష్ట్రానికి పెట్టుబడులు రావడం లేదని… పరిశ్రమలు తరలి వెళ్లిపోతున్నాయంటూ దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఇలాంటి వారికి మేం తీసుకొస్తున్న పెట్టుబుడులు, కల్పిస్తున్న ఉద్యోగాలు కనిపించడం లేదా? అని ప్రశ్నించారు. తెలంగాణ ప్రజలు ఆలోచించాలని కోరారు. ‘‘ఇక్కడి యువత ప్రతిభే మాకున్న పెద్ద ఆస్తి. డిగ్రీ, ఇంజినీరింగ్ పట్టా తీసుకుని బయటికొచ్చే విద్యార్థుల్లో పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలు ఉండటం లేదనే ఫిర్యాదు పారిశ్రామికవేత్తల నుంచి తరచూ వస్తోంది. ఈ అంతరాన్ని తగ్గించేందుకే అంతర్జాతీయ ప్రమాణాలతో ‘యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ’ని ఏర్పాటు చేశాం. మీ అందరి భాగస్వామ్యంతో కోర్సులకు రూపకల్పన చేసి.. మీకు కావాల్సిన మానవ వనరులను రెడీమేడ్ గా అందిస్తున్నాం. మీకు ఖర్చు, శ్రమ తగ్గిస్తున్నాం’’ అని పారిశ్రామికవేత్తలకు వివరించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే రాయ్ డిన్ రోచ్, శైవ గ్రూప్ చైర్మన్Ê సీఈవో అమిత్ జగన్నాథ్ వర్మ, టారనిస్ కేపిటల్ సీఈవో నికోలస్ ఎస్.బింగ్ హామ్, రివలేషన్స్ బయోటెక్ ఎండీ రవిచంద్ర బీరం, మనాకిన్ బయో డైరెక్టర్ జశ్వంత్ ప్రణవ్ యతిరాజాం, స్వబోధ ఇన్ఫినిటీ ఇన్వెస్ట్ మెంట్స్ అడ్వైజర్స్ సీఈవో సంకర్ష్ చందా, ఎగ్జిగెంట్ డ్రిల్లింగ్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ పాండురంగా రావు తమ్మినేని, యంత్ర టెక్ కంట్రోల్స్ సీఈవో సమీర్ కాంత్ తదితరులు పాల్గొన్నారు.