Thursday, June 12, 2025
Homeరెండు పూటలా భోజనం కరువు

రెండు పూటలా భోజనం కరువు

. అందని సమతుల్య ఆహారం
. సగం మంది పరిస్థితి ఇదే
. ‘థాలీ’ అధ్యయనంలో వెల్లడి

న్యూదిల్లీ : దేశంలో పేదరికం తగ్గిందని మోదీ ప్రభుత్వం ప్రచారం చేసుకుంటున్న తరుణంలో ఆహార కొరత విస్తృతంగా ఉందని, గ్రామాల్లో`పట్టణాల్లో దాదాపు సగం జనాభా రెండు పూటల కడుపు నిండా భోజనం చేయలేని పరిస్థితి ఉందని తాజా అధ్యయనంలో తేలింది. జనాభాలో చాలామంది రెండు పూటలా పుష్టిగా భోజనం చేసే పరిస్థితి లేదని, ఆహార కొరత తీవ్రంగా ఉందని తెలిపింది. ‘ఫుడ్‌ డిప్రివేషన్‌: ఏ థాలీ ఇండెక్స్‌’ ‘ఆహార లేమి: ఒక థాలీ (ప్లేటు) సూచీ’ పేరిట నివేదిక విడుదలైంది. దారిద్య్ర రేఖకు ఎగువనున్న చాలా మంది అనుభవించే పౌష్టికాహార లేమిని పేదరిక గణాంకాలు పరిగణించడం లేదని సెంటర్‌ ఫర్‌ డెవలప్‌మెంట్‌ స్టడీస్‌కు చెందిన పులాప్రే బాలకృష్ణన్‌, ఆంధ్రప్రదేశ్‌లోని క్రియా విశ్వవిద్యాలయానికి చెందిన అమన్‌ రాజ్‌ చేసిన ఈ అధ్యయన నివేదిక పేర్కొంది. థాలీ (ప్లేటు) భోజనం ఆధారంగా జీవన ప్రమాణాలను పరిగణనలోకి తీసుకుంటూ ఆహార కొరతను ప్రముఖంగా పేర్కొంటూ పేదరికంపై సమీక్ష ఆవశ్యకతను నొక్కిచెప్పింది. నిత్యం దేశ జనాభాలో ఎంతమంది సంపూర్ణ, సముతుల్య ఆహారాన్ని రెండు పూటలా తీసుకోగలరన్న అంచనాయే ‘థాలీ సూచీ’. సమతుల్య ఆహారం అత్యధిక మంది తీసుకోలేకపోతున్నారంటూ పౌష్టికాహార లోపాన్ని ఈ అధ్యయనం ప్రముఖంగా పేర్కొంది. ఆదాయానికి మించిన ఖర్చు, సమతుల్య ఆహారాన్ని జనాభా తీసుకోలేకపోవడాన్ని దారిద్య్ర రేఖ ప్రమాణాలు లెక్కలోకి తీసుకోలేదని తెలిపింది. రెండు పూటలా శాఖాహార భోజనాన్ని గ్రామీణ జనాభాలో 40 శాతం మందికి చేయలేరని, ఒక ప్లేటు శాఖాహార భోజనం, మరొక ప్లేటు మాంసాహార భోజనం (రూ.88 వెచ్చించి) తినే స్తోమత 80 శాతం మందికి లేదని అధ్యయనంలో వెల్లడైంది. అదే విధంగా పట్టణ జనాభాలో 10 శాతం మంది రోజుకు రెండు పూటలా శాఖాహార భోజనం తీసుకోలేరని, ఒక పూట శాఖాహారం, మరోపూట మాంసాహారంతో భోజనం చేయలేని వారు 50 శాతం మేర ఉన్నారని నివేదిక పేర్కొంది. ప్రజలు గుర్తించిన దాని కంటే గ్రామీణ భారతంలో ఆహార కొరత ఎక్కువని వెల్లడిరచింది. స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఇటీవలి నివేదిక ప్రకారం గ్రామాల్లో, పట్టణాల్లో పేదరికం ఐదు శాతం కంటే తక్కువని వెల్లడైంది. అప్‌డేట్‌ చేసిన టెండూల్కర్‌ దారిద్య్ర రేఖ 201112 గణాంకాల ఆధారంగా ఈ నివేదిక వెలువడిరది. ద్రవ్యోల్బణం రేటును వర్తింపజేసి తదుపరి దారిద్య్ర రేఖలను 202324లో గ్రామాల్లో రూ.1,632, పట్టణాల్లో రూ.1,944గా ఖరారు చేశారు. కాగా, గ్రామాల్లో 40 శాతం, పట్టణాల్లో 2030 శాతం మంది రెండు పూటలా పౌష్టికాహారం తీసుకోలేరని థాలీ సూచీ పేర్కొంది. కుటుంబాలు/వ్యక్తులు స్వేచ్ఛగా తమ ఆదాయాన్ని ఆహారం కోసం ఖర్చు పెడతారని పేదరికంపై అధ్యయనాలు సూచిస్తున్నట్లు అధ్యయనకర్తలు బాలకృష్ణన్‌, రాజ్‌ పేర్కొన్నారు. మరోవైపు ప్రపంచ ఆకలి సూచీ2024లో భారత్‌ 105వ స్థానంలో ఉంది. మొత్తం 127 దేశాలు ఇందులో ఉన్నాయి. అయితే బంగ్లాదేశ్‌ కంటే కూడా భారత్‌ వెనుకబడటం గమనార్హం.
ఇదిలావుంటే భారత్‌లో పేదరికం రేటు బాగా తగ్గిందని ప్రపంచ బ్యాంకు తాజా నివేదిక పేర్కొంది. 201112లో 27.1 శాతం నుంచి 202223లో 5.3 శాతానికి క్షీణించినట్లు వెల్లడిరచింది. అదే కాలంలో దారిద్య్ర రేఖకు దిగువునున్న ప్రజల సంఖ్య 344.47 మిలియన్ల నుంచి 75.24 మిలియన్లకు తగ్గినట్లు పేర్కొంది. ఈ ఘనత ప్రధాని మోదీకే దక్కుతుందని, ఇది సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ పరిణామంగా ప్రభుత్వం చెప్పుకుంటోంది.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు