. అమెరికా చట్టాలు… సమాజ మార్పులు అర్థం చేసుకోవాలి
. లక్ష్యసాధనలో అవరోధాలు ఎదురొడ్డి నిలబడాలి
. టెక్సాస్ వర్సిటీ విద్యార్థులతో కేటీఆర్ ముఖాముఖి
విశాలాంధ్ర – హైదరాబాద్ : అమెరికాలో ఇబ్బందులు పడే భారతీయ విద్యార్థులకు అండగా నిలబడ తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఎన్నో ఆశలతో ఉన్నత విద్య కోసం వచ్చిన విద్యార్థులు, అవగాహన లేక ఏమైనా తప్పు చేస్తే వారికి అవసరమైన న్యాయసహాయం అందించేందుకు బీఆర్ఎస్ అమెరికా విభాగం తరపున ప్రయత్నం చేస్తామన్నారు. విద్యార్థులు కూడా అమెరికా చట్టాలను అక్కడి సమాజంలో వస్తున్న మార్పులను అర్థం చేసుకొని మసులుకో వాలని కేటీఆర్ సూచించారు. పరిస్థితు లను ప్రతీ విద్యార్థి అవగాహన చేసుకోవాల న్నారు. డల్లాస్లోని యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్లో చదువుకుంటున్న విద్యార్థులతో మంగళవారం కేటీఆర్ మాట్లాడారు. విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. అమెరికా పోవాలన్నా, చదువుకో వాలన్నా ఎన్నో వ్యయ, ప్రయాసలకు గురయ్యే వాళ్ళమన్న కేటీఆర్, ప్రపంచం వేగంగా మారి ఇప్పుడు అనేక సౌకర్యాలు అందుబాటులోకి వచ్చాయన్నారు. అమెరికా విద్య కూడా అనేక మందికి అందుబాటు లోకి వచ్చిందన్నారు. కేవలం ర్యాంకుల కోసమో, గ్రేడ్ల కోసమో కాకుండా జీవితంలో సాధించాల్సిన ప్రధాన లక్ష్యాల పైన దృష్టి పెట్టాలన్నారు. స్వల్ప కాలంలోనే తమ కలలు, ఆకాంక్షలను అందిపుచ్చు కోవాలన్నారు. లక్ష్యం వైపు సాగే క్రమంలో అవరోధాలు ఎదురైనా నిబద్ధతతో ముందుకు పోవాలన్నారు. ప్రపంచ వ్యాప్తంగా గొప్ప ఆవిష్కరణలు వస్తున్నాయని, ఇన్నోవేషన్ రంగంలో ప్రపంచ దేశాలతో ఇండియా పోటీపడి రాణించాల్సిన అవసరం ఉందన్నారు. భారతీయ విద్యార్థులు నూతన ఆవిష్కర ణలపై దృష్టి సారించాలన్నారు.
కష్టాలను ఇష్టాలుగా మలచుకున్నప్పుడే కలలు సాకారం అవుతాయి అనడానికి కేసీఆర్ జీవితమే సాక్ష్యమన్నారు. నాలుగు పదుల వయ సులో పదవులను త్యాగం చేసి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఉద్యమం మొదలు పెట్టిన రోజు అనేకమంది ఆయనను అవహేళన చేశారని చెప్పారు. 14 సంవత్సరాల నిరంతర పోరాటం తర్వాత ప్రత్యేక రాష్ట్రం సాధించుకున్నప్పుడు సమాజంలోని ప్రతి ఒక్కరు ఆయనపై ప్రశంసల జల్లు కురిపించారన్నారు. ఇండియాకి తిరిగి వచ్చి కంపెనీలు ప్రారంభించాలని విద్యార్థులను కోరారు. మేథోవలస మన దేశానికి పెను సవాలుగా మారిందని చెప్పారు. దేశాభివృద్ధిలో, తెలంగాణ అభివృద్ధిలో విదేశీ యువత భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు.