ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం గౌరవ సలహాదారులు అన్నం అరవింద్
విశాలాంధ్ర ధర్మవరం;; విద్యార్థులు నిత్యం యోగా చేస్తే ఏకాగ్రతతో పాటు జ్ఞాపకశక్తి కూడా పెరుగుతుంది అని ఉపాధ్యాయ సంఘం గౌరవ సలహాదారుడు అన్నం అరవింద్ తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలోని సాయి నగర్లో గల లయోలా పాఠశాల యందు ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో యోగా దినోత్సవం పురస్కరించుకొని విద్యార్థులకు యోగ పై అవగాహన, అభ్యాసాలు చేయించారు. ఈ సందర్భంగా అన్న మరవిందు మాట్లాడుతూ విద్యార్థులు ఆసనాలు చేయడం వలన శరీర దృఢత్వంతో పాటు, అనారోగ్యానికి మనం దూరంగా ఉంటామని తెలిపారు. యోగాతోనే మానసిక ఆరోగ్యం ఏర్పడుతుందని, అందుకే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు యోగా కార్యక్రమాన్ని ప్రవేశపెట్టడం జరిగిందని తెలిపారు. యోగాతోనే శారీరక మానసిక ఆరోగ్యం పొందాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో లయోలా పాఠశాల కరేష్పాండెంట్ శంకర్ నాయుడు, జిల్లా సామాజిక సమరసత వేదిక కన్వీనర్ గడ్డం వాసుదేవయ్య, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
విద్యార్థులు నిత్యం యోగా చేస్తే ఏకాగ్రత, జ్ఞాపకశక్తి పెరుగుతుంది
RELATED ARTICLES