సెర్బియాలో రోడ్డెక్కిన విద్యార్థులుబెల్గ్రేడ్ సహా 30కి పైగా నగరాల్లో నిరసనలు
బెల్గ్రేడ్ : సెర్బియాలో విద్యార్థులు రోడ్డెక్కారు. అవినీతికి వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనలు ఏడు నెలల మార్కునకు చేరుకోవడంతో రాజధాని బెల్గ్రేడ్ సహా 30కిపైగా నగరాల్లో భారీ నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. సావా నదిపై ఉన్న రెండు వంతెలను దిగ్బంధిం చారు. రహదారులపై రాకపోకలు నిలిపి వేశారు. సెర్బియా మేల్కొన్నదని, మౌనంగా ఉండేది లేదని పెద్ద పెట్టున నినాదాలు ఇచ్చారు. న్యాయం, చట్టబద్ధ పరిపాలన కోసం పోరాటానికి సంకల్పించారు. సెర్బియా రైల్వే స్టేషన్లో గతేడాది నవంబరులో స్లాబు కూలి 16 మంది మరణించిన అనంతరం ప్రభుత్వంలో అవినీతిపై విద్యార్థులు గర్జించారు. ఏడు నెలలుగా నిరసనలతో సెర్బియాను హోరెత్తిస్తున్నారు. ముందస్తు ఎన్నికల కోసం డిమాండ్ చేస్తున్నారు.