అందించిన టిడిపి నియోజకవర్గ ఇన్చార్జ్ పరిటాల శ్రీరామ్
విశాలాంధ్ర- ధర్మవరం : ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించిన ఓ టిడిపి కార్యకర్త కుటుంబానికి 5 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ సహాయం రూపంలో గల చెక్కును పరిటాల శ్రీరామ్ ఆ చెక్కును కుటుంబానికి అందజేశారు. ఇందులో భాగంగా మండల పరిధిలోని రేగాటిపల్లి పంచాయతీలోని సీతారాం పల్లి గ్రామానికి చెందిన మారుతి జనవరి 11న రోడ్డులో మరణించిన విషయం తెలిసిందే. అనంతరం పరిటాల శ్రీరామ్ మాట్లాడుతూ మృతి చెందిన మారుతి గత కొన్ని సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీలో సేవలు అందించారని తెలిపారు. ఈ ఐదు లక్షల నగదు సభ్యత నమోదు ద్వారా ఇన్సూరెన్స్ రూపంలో వచ్చిందని తెలిపారు. తదుపరి మృతి చెందిన కుటుంబాన్ని కూడా వారు పలకరించారు. మీ కుటుంబానికి టిడిపి అన్నివేళలా అండదండలుగా ఉంటుందని తెలిపారు. తెలుగుదేశం పార్టీలో సభ్యత్వం అంటే కుటుంబానికి ఒక భరోసా అని తెలిపారు. కేవలం ఒక వంద రూపాయలు కడితే రెండు లక్షల రూపాయల సహాయం అందుతుందని, ఇప్పుడు దానిని ఐదు లక్షలకు పెంచడం జరిగిందని తెలిపారు. ఈ ఆలోచన నారా లోకేష్ కు రావడం వల్ల అన్ని పార్టీలకు తెలుగుదేశం పార్టీని ఒక ఆదర్శంగా మార్చిన ఘనత నారా లోకేసుకే దక్కిందని వారు తెలిపారు.
రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన టిడిపి కార్యకర్త కుటుంబానికి 5 లక్షలు ఆర్థిక సహాయం
RELATED ARTICLES