Monday, June 23, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయిజర్నలిస్ట్ పిల్లలకు పాఠశాలల్లో 50 శాతం ఫీజు రాయితీ

జర్నలిస్ట్ పిల్లలకు పాఠశాలల్లో 50 శాతం ఫీజు రాయితీ

ఎంఈఓలు- రాజేశ్వరి దేవి, గోపాల్ నాయక్
విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని జర్నలిస్టు పిల్లలకు పాఠశాలల్లో 50 శాతము ఫీజు రాయితీ ఉంటుందని ఎంఈఓలు రాజేశ్వరి దేవి గోపాల్ నాయక్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డీఈవో క్రిష్టప్ప ఆదేశాల మేరకు ప్రభుత్వం జారీ చేసిన అక్విటేషన్ కార్డు ఉన్న జర్నలిస్టులకు మాత్రమే ఈ అవకాశం ఉంటుందని వారు తెలిపారు. పట్టణములో పనిచేస్తున్న వర్కింగ్ జర్నలిస్టు పిల్లలకు ప్రైవేట్ అండ్ కార్పొరేట్ పాఠశాలల్లో తప్పనిసరిగా 50 శాతం ఫీజు రాయితీ కల్పించబడిందని తెలిపారు. ప్రైవేట్ అండ్ కార్పొరేట్ పాఠశాలలో ఈ ఉత్తర్వులను కచ్చితంగా అమలు చేయాలని వారు తెలిపారు. ఫిర్యాదులు అందితే కఠిన చర్యలు తప్పవు అని తెలిపారు. కావున పాఠశాల యాజమాన్యం డీఈవో ఉత్తర్వులను గౌరవించి, పాత్రికేయ పిల్లలకు చదువు విషయంలో 50 శాతము ఫీజు వర్తింప చేయాలని తెలిపారు. ఈ సందర్భంగా పట్టణ పాత్రికేయులు కలెక్టర్కు, డీఈఓ కు, ఎంఈఓ లకు కృతజ్ఞతలను తెలియజేశారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు