Wednesday, April 16, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయిఘనంగా అగ్నిమాపక వారోత్సవాలు..

ఘనంగా అగ్నిమాపక వారోత్సవాలు..

అగ్నిమాపక అధికారి యు. రాజు.
విశాలాంధ్ర ధర్మవరం:; పట్టణంలోని సంజయ్ నగర్ లో గల అగ్నిమాపక కార్యాలయంలో ఈనెల 15వ తేదీ నుంచి అగ్నిమాపక వారోత్సవాల కార్యక్రమాన్ని అగ్నిమాపక అధికారి యు. రాజు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా రాజు మాట్లాడుతూ మొదటి రోజు పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్, కళాజ్యోతి సర్కిల్, ఎన్టీఆర్ సర్కిల్లో అగ్నివి ప్రమాదాలు జరగకుండా తీసుకోవలసిన జాగ్రత్తలను గూర్చి ప్రజలకు వివరిస్తూ వాటర్ డెమో ద్వారా చేసి చూపించడం జరిగింది అని తెలిపారు. అదేవిధంగా అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలు, నివారించే పద్ధతుల తెలిపే కరపత్రాలను కూడా ప్రజలకు పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. ఈ అగ్నిమాపక వారోత్సవాలు ఏప్రిల్ 14 నుండి 20వ తేదీ వరకు జిల్లా అధికారుల ఆదేశాలమేరకు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అంతేకాకుండా జాతీయ మౌలిక సదుపాయాల అభివృద్ధికి అగ్ని బద్ధతపై పూర్తి దశలో ప్రజలకు అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. సాధారణ జాగ్రత్తలు లో భాగంగా ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకోవాలని, వస్తువులను చిందిరావందరంగా లేకుండా సక్రమంగా ఉంచుకోవాలని తెలిపారు. ఇంట్లో ఉన్న చిన్న పిల్లలకు అగ్గిపెట్లు, లైటర్లు, టపాకాయలు, ఎలక్ట్రికల్ సామాగ్రి, ఇతర మండే పదార్థములు ఏవి కూడా అందుబాటులో ఉంచరాదని తెలిపారు. అనుకోకుండా జరిగే అగ్ని ప్రమాదాలకు ముందుగానే కొంత నీటిని మీ ఇంటిలో నిల్వ చేసుకోవాలని తెలిపారు. ఇంట్లో వంటింటి క్రింద పై భాగాలలో గాలి, వెలుతురు ఉండేటట్లు చూసుకోవాలని, సిలిండర్ విషయంలో తగు జాగ్రత్తలు కూడా తీసుకోవాలని తెలిపారు. గ్యాస్ లీక్ అవుతున్నట్లు మీకు తెలిసిన వెంటనే రెగ్యులేటర్లను తప్పక ఆపివేయాలని తెలిపారు. వంట చేసేటప్పుడు సరియైన నూలు బట్టలు ఏఫ్రాన్ దుస్తులు ధరించాలని తెలిపారు. ప్రమాదవశాత్తు మీ బట్టలకు నిప్పు అంటుకుంటే భయంతో పరిగెత్తవద్దని, నేలపై దొర్లి, దుప్పటి లేదా కోటు లేదా పెద్ద టవల్ను చుట్టుకోండి అని తెలిపారు. మీ చుట్టుపక్కల అగ్ని ప్రమాదం జరిగితే ప్రతి ఒక్కరూ ఆరు బయటకు వెంటనే సురక్షితంగా రావాలని తెలిపారు. అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు విలువైన వస్తువులు గూర్చి సమయాన్ని వృధా చేసుకోకుండా వాటి కొరకై తిరిగి లోనికి ప్రవేశించరాదని తెలిపారు. విద్యుత్ పరికరాలకు నిప్పంటుకున్నప్పుడు నీళ్లతో ఆర్పవద్దని దీనివల్ల కరెంటు షాక్ కు తగిలి ప్రాణాపాయము కలగవచ్చునని తెలిపారు. అలా కాకుండా వెంటనే కరెంటును ఆఫ్ చేయాలని తెలిపారు. అగ్ని ప్రమాదం జరిగిన వెంటనే పట్టణ అగ్నిమాపక కేంద్రానికి గాని 101 కు సమాచారాన్ని అందించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో అగ్నిమాపక సిబ్బంది పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు