ప్రభుత్వ విప్,ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య
విశాలాంధ్ర -నందిగామ: మానవసేవే మాధవసేవ అనే స్ఫూర్తితో ముందుకు వెళ్తున్న తాళ్లూరి చారిటబుల్ ట్రస్ట్ వారి కి నందిగామ శాసనసభ్యురాలు,ప్రభుత్వ విప్ తంగిరాల సౌమ్య ప్రత్యేక అభినందనలు తెలియజేశారు స్థానిక దేవినేని వెంకటరమణ ప్రభుత్వ వైద్యశాల నందు రోగులకు గత నలభై రోజులగా అందిస్తున్న కార్యక్రమంలో గురువారం ఆమె పాల్గొన్నారు ట్రస్ట్ నిర్వాహకులను ఆమె దుశ్యాలువాలతో సన్మానించి అభినందనలు తెలియజేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రార్ధించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న అని పెద్దవాళ్లు ఏనాడో చెప్పారని,దైవం మానవ రూపం అంటే ఇదేనేమో అని అన్ని దానాలలో కెల్లా అన్నదానం గొప్పది అని తాళ్లూరి చారిటబుల్ ట్రస్ట్ వారు ఇటువంటి మానవతా సేవా కార్యక్రమాలు నందిగామలో ఎన్నో చేపట్టారనీ, గత 40 రోజుల నుంచి నందిగామ గవర్నమెంట్ డివిఆర్ ఏరియా హాస్పిటల్ నందు రోగులకు మరియు స్థానిక ప్రజానీకానికి అల్పాహార వితరణ చేయటం గర్వించదగ్గ విషయమని అన్నారు పేద బడుగు బలహీన వర్గాలకు వారికి ట్రస్ట్ ద్వారా చేతనైన మేరకు నాణ్యమైన ఉచిత సేవలు అందిస్తూ వస్తున్నారని,వీరిని స్ఫూర్తిగా తీసుకొని సమాజంలో అందరూ ముందుకు వెళితే సామాన్య బడుగు బలహీన వర్గ పేద ప్రజలకు ఆదరణ పెరుగుతుందని తెలియజేస్తూ ఆ భగవంతుడి ఆశీస్సులతో మునుముందు రోజులలో తాళ్లూరి చారిటబుల్ ట్రస్ట్ వారు మరెన్నో సేవా కార్యక్రమాలు చేపట్టాలని తెలియజేశారు అనంతరం ట్రస్ట్ నిర్వాహకులు ఆమెను ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో హాస్పిటల్ కమిటీ చైర్మన్ వేపూరి నాగేశ్వరరావు,గవర్నమెంట్ హాస్పిటల్ సిబ్బంది,రోగులు మరియు కూటమి నేతలు తదితరులు పాల్గొన్నారు.