Saturday, April 19, 2025
Homeజిల్లాలునెల్లూరుమూగజీవాల దాహార్తిని తీర్చేందుకే నీటి తొట్టెల నిర్మాణం..

మూగజీవాల దాహార్తిని తీర్చేందుకే నీటి తొట్టెల నిర్మాణం..

పీడీ గంగా భవాణి

విశాలాంధ్ర- వలేటివారిపాలెం : గ్రామాల్లో ఉన్న మూగజీవాల దాహార్తిని తీర్చేందుకే నీటి తోట్టెలు నిర్మాణం చేపట్టినట్లు నెల్లూరు జిల్లా డ్వామా పీడీ గంగా భవాణి అన్నారు. గురువారం వలేటివారిపాలెం మండలంలోని పోకూరు, సింగమనేని పల్లి గ్రామాలలో ఉపాధిహామీ నిధులతో ఏర్పాటు చేసిన నీటి తొట్టెలను ఆమె పరిశీలించారు.ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకొని మూగజీవాలకు తాగు నీటి ఇబ్బందులు తలెత్తకుండా దాహం తీర్చడానికి ఈ నీటి తొట్టెలను ఏర్పాటు చేసినట్లు ఆమె తెలిపారు. పోకూరులో ఏర్పాటు చేసిన నీటి తొట్టెను చూసి ఆనందం వ్యక్తం చేసి పీల్డ్ అసిస్టెంట్ నవులూరి సుబ్బా నాయుడు ని అభినందించారు.పోకూరు నీటి తొట్టెను పీడీ పరిశీలిస్తున్న సమయంలోదారిన వెళుతున్న గొర్రెలు, మేకలు నీటిని చూసి వచ్చి నీటిని తాగడంతో పీడీ ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా మూగ జీవాల యజమానులను ఈ నీటి తొట్టెల వల్ల మీకు ఉపయోగమా కాదా అని అడగగా వేసవి కాలంలో నీటికి చాలా ఇబ్బందులు పడేవారమని ఈ నీటి తొట్టెను నిర్మాణం చేసి మీరు పుణ్యం కట్టుకున్నారని, ఈ నీటి తొట్టెను నిర్మాణం చేసిన పీల్డ్ అసిస్టెంట్ సుబ్బానాయుడు కు , అధికారులకు మూగ జీవాల యజమానులు కృతజ్ఞతలు తెలియజేశారు .ఈ కార్యక్రమంలో ఏపీఢీ బాబూరావు, ఏపీఓ లు దయాసాగర్, ఉమా మహేష్, సమీర్ బాషా,ఈసీ.వంశీ. టిఏ లు మాలకొండయ్య, అశోక్, నాగార్జున, ప్రసాదు, మాలకొండయ్య, పీల్డ్ అసిస్టెంట్ నవులూరి సుబ్బానాయుడు, నాయకులు నలమోతు రవీంద్ర, బొల్లినేని నరసింహం, ఘట్టమనేని లక్ష్మీనరసింహం, రావి కృష్ణ, తిరుమల రావు, ఘట్టమనేని లక్ష్మీనరసింహం తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు