Saturday, April 19, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయిమే 2న ఆది శంకరాచార్యుల జయంతి వేడుకలు

మే 2న ఆది శంకరాచార్యుల జయంతి వేడుకలు

బ్రాహ్మణ సంకర జయంతి కమిటీ, శ్రీ గాయత్రీ బ్రాహ్మణ సేవా సంఘం
విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని బ్రాహ్మణ వీధిలో గల శ్రీలక్ష్మి చెన్నకేశవ స్వామి దేవస్థానంలో మే 2వ తేదీన జగద్గురు ఆది శంకరాచార్యుల జయంతి వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నట్లు రామారావు, శివ కుమార్ శర్మ తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ శంకర చార్యుల జయంతి రోజునే ఉచితంగా సామూహిక ఉపనయములు నిర్వహిస్తామని తెలిపారు. ఈ జయంతి వేడుకలు బ్రాహ్మణ శంకర జయంతి కమిటీ, శ్రీ గాయత్రీ బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు.కావున బ్రాహ్మణులు కుటుంబంలో ఎవరైనా ఉపనయనము చేయదలచిన వారు సెల్ నెంబర్ 9603535811 లేదా 944033290కు సంప్రదించాలని తెలిపారు. ఈ అవకాశంను బ్రాహ్మణులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు