- Advertisement -
విశాలాంధ్ర ధర్మవరం:: పట్టణంలోని మహాత్మా గాంధీ నగర్ లో అనారోగ్యంతో బాధపడుతున్న వడ్డే శ్రీనివాస్ కుటుంబానికి ధర్మవరం రిటైర్డ్ ఉద్యోగ సంఘం అధ్యక్షులు చలపతి, ఉపాధ్యక్షులు శ్రీరాములు, కార్యదర్శి శివలింగన్న, కోశాధికారి సుధాకర్ తమ వంతుగా 2500 ఆర్థిక సహాయాన్ని అందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇటువంటి కుటుంబాలకు ప్రతి ఒక్కరూ ఆర్థిక సహాయం అందించి మానవతా విలువలు పెంచేలా సహకరించాలని తెలిపారు. అనంతరం కుటుంబ సభ్యులు రిటైర్డ్ ఉద్యోగ సంఘం వారికి కృతజ్ఞతలు తెలియజేశారు.


