సంఘం అధ్యక్షులు సానే రవీంద్రారెడ్డి
విశాలాంధ్ర ధర్మవరం;; 80 లక్షల టర్నోవర్తో మున్సిపల్ టీచర్స్ కో-ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ పనిచేస్తుందని ఆ సంఘం అధ్యక్షులు సానే రవీంద్రారెడ్డి, కార్యదర్శి రామకృష్ణ నాయక్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గోల్డెన్ జూబ్లీ సర్వ సభ్య సమావేశమును నిర్వహించడం జరిగిందని, 50 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా సమావేశంలో వారి విషయాలను కూడా చర్చించడం జరిగిందని తెలిపారు. ఆనాడు 500 రూపాయల రుణ సౌకర్యముతో మొదలై నేడు మూడు లక్షల వరకు రుణ సదుపాయాన్ని కల్పిస్తూ మున్సిపాలి టీచర్స్ కు 50 సంవత్సరాలుగా సేవలు అందిస్తున్నామని వారు తెలిపారు. ఈ సంఘం అభివృద్ధికి అందరూ పాటుపడాలని వారు తెలియజేశారు. ఈ సందర్భంగా సంఘ సభ్యులందరికీ బ్యాగులను బహుమతిగా అందజేశారు. తదుపరి ఇంత ఇంతవరకు సంఘానికి అకౌంటెంట్గా పని చేసిన పార్తసారథి ను సంఘం తరఫున ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో కార్యవర్గ సభ్యులు రమేష్ బాబు, అమానుల్లా, రాంప్రసాద్, అంజి నాయక్, సాయి గణేష్, హెడ్మాస్టర్లు రాంప్రసాద్, లక్ష్మి నారాయణ రెడ్డి తదితర మున్సిపల్ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
80 లక్షల టర్నోవర్ తో మున్సిపల్ టీచర్స్ కో ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ పనిచేస్తోంది..
RELATED ARTICLES