Saturday, May 10, 2025
Homeజిల్లాలుఅనంతపురంవృద్ధులకు దుస్తులతో పాటు భోజనం పంపిణీ

వృద్ధులకు దుస్తులతో పాటు భోజనం పంపిణీ

విశాలాంధ్ర- తనకల్లు : మండల కేంద్రంలోని శ్రీ సాయి సేవా ట్రస్ట్ ద్వారా వృద్ధ అనాధాశ్రమం లో కదిరికి చెందిన కొత్తపల్లి ముద్దిరెడ్డి,లలితమ్మల మనవరాలు ఆరాధ్య పుట్టినరోజు సందర్భంగా వస్త్రాలతో పాటు ఒకరోజు భోజనం ఏర్పాటు చేశారు. వృద్ధులకు ముత్తిరెడ్డి చేతుల మీదుగా వస్త్రాలు పంపిణీ చేసిన అనంతరం వారు మాట్లాడుతూ మా మనవరాలు పుట్టినరోజు సందర్భంగా ఇలాంటి కార్యక్రమం చేయడం చాలా సంతోషించదగ్గ విషయమని ప్రతి ఒక్కరూ పేదలకు వృద్ధులకు తమ వంతు సహాయం అందించాలన్నారు. ఈ వృద్ధ అనాధాశ్రమం ప్రశాంత వాతావరణంలో చాలా బాగుందని ఏ అండ లేనివారికిఈ మండలంలో ఇలాంటి వృద్ధాశ్రమం ఉండడం శుభ పరిణామం అన్నారు. వృద్ధ అనాధాశ్రమం ఏర్పాటు చేసిన వారికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆశ్రమ నిర్వాహకురాలు తులసమ్మ శివరామిరెడ్డి, హరి,శారదమ్మ అనసూయమ్మ పర్వీన్ తో పాటు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు